ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయం తీసుకొని ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు. సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. 


ఏ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చారు. ఆ ఎన్నికలు వచ్చేకి ఇంకా 5 ఏళ్ళు ఉంది. ముందు ఈ మూడు సంవత్సరాలు బాగా లాగి తర్వాత కొన్ని హామీలు నెరవేరుద్దాంలే అనుకునే వారు. కానీ ఇప్పుడు ఉన్న మన యువ  ముఖ్యమంత్రి జగన్ ఆలా కాదు.. 


ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలి.. ప్రజల కోరిక తీర్చాలి.. ఆంధ్రని అభివృద్ధి వైపు నడిపించాలి అని అనుకుంటున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు ఒకొక్కటిగా నెరవేరుస్తున్నారు. నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు కలిపించి రికార్డు సృష్టించాడు. 


ఆశా వర్కర్లకు జీతాల భారీగా పెంచడు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే వారికీ ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాడు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పాడు సీఎం జగన్. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాడు సీఎం జగన్. 


దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ అంటూ జగన్ కు ప్రశంశిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ తమకు వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశాడు. ఏది ఏమైతేనేం తండ్రి రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు సీఎం జగన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: