రోజు రోజుకి మానవత్వం మరిచి పోతున్నారు మనుషులు . సాటి మనిషిని మనిషిగా చూడడం మరుచి  ప్రాణాలను తీసేస్తున్నారు. ఇక అన్నదమ్ములు అయితే భూతగాదాలు పరువు  తగాదాలు అంటూ కనీస మానవత్వం మరిచి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. ఓకే తల్లి  పేగు తెంచుకుని పుట్టిన అన్నదమ్ములు కూడా... ఒకరినొకరు కాlడ తేర్చుకుంటున్నారు. ఇక్కడ ఓ తమ్ముడు అదే చేసాడు. అన్నయ్య కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో పరువు పోతుందని భావించాడు తమ్ముడు. ఇక దానికి తోడు భూ తగాదాలు కూడా ఉండడంతో తన అన్నయ్య ఇద్దరు కూతుర్లని దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురై విగతజీవులుగా  పడి పోయారు. 

 

 

 

 

 

 కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామ శివారులోని మల్లయ్య దేవాలయం ప్రాంతంలో మూడు శవాలు పడి ఉన్నాయి. అయితే అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు ఆ శవాలను చూసి పోలీసులకు సమాచారం  అందించడంతో విచారించారు. విచారణలో సొంత తమ్ముడి ఆ ముగ్గురిని చంపాడని తేలింది . కాగా  మృతులు భిక్కనూరు మండలం జంగంపల్లి కి చెందిన బాలయ్య... అతని కూతురు చందన లతలు గా గుర్తించారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం బాలయ్య కూతురు లత ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ విషయంలో విభేదించిన బాలయ్య తమ్ముడు రవి పరువు పోతుందని బాలయ్యతో వాదించాడు అయినప్పటికీ బాలయ్య  పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు రావడంతో అన్న బాలయ్య పై కక్ష పెంచుకున్న తమ్ముడు రవి... అన్నయ్య అడ్డు తొలగించాలని అనుకున్నాడు . 

 

 

 

 

 పథకం ప్రకారం అన్న ఇద్దరు కూతుళ్లను తీసుకుని దోమకొండ తీసుకెళ్లి  అక్కడ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ముగ్గురికి తాగించాడు. అయితే అది తాగిన ఆ ముగ్గురు కాసేపటికి స్పృహ కోల్పోవడంతో... అదే అదనుగా భావించిన రవి బ్లేడుతో గొంతు కోసి అతి దారుణంగా ముగ్గురిని హత్య చేశాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి డిఎస్పీ  లక్ష్మీనారాయణ హత్యలకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: