చంద్రబాబు మీద జగన్ గురి పెడుతూనే ఉన్నారు. జగన్ సీఎం కాకముందు నుంచే ఇద్దరి మధ్య బద్ద వైరం సాగుతోంది. ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు. తాను ఏమనుకుంటే అది చేయగలస్థితిలో ఉన్నారు. దాంతో గత టీడీపీ సర్కార్ టైంలో జరిగిన అవకతవకల మీద ద్రుష్టి పెట్టిన జగన్ ఇపుడు వాటిపై గట్టిగానే  విచారణను జరిపిస్తున్నారు. దాంతో నివేదిక ఇలా చేతిలో పడితే చాలు అక్కడ  మటాషే అంటున్నారు.


మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామలో చంద్రబాబు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని   నిర్మించేస్తున్నారు.  తాను సీఎంగా  ఉండగా అతి పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ప్రభుత్వ స్థలం తనకు తానే కేటాయించుకున్నారు. అంటే కుడిచేత్తో సీఎంగా బాబు ఇస్తే ఎడమ చేత్తో టీడీపీ అధినేత నాయుడుగా అందుకున్నారన్నమాట.


ఇక ఇక్కడ తమకు కేటాయించిన భూమితో పాటు ప్రభుత్వ స్థలాన్ని, పోరంబోకు లాండ్ ని ప్రైవేట్ గా ఉన్న రైతుల భూములను ఆక్రమించి మరీ టీడీపీ ఆఫీస్ కట్టేస్తోందని వైసీపీ ద్రుష్టిని వచ్చింది. అంతే దాని మీద లోతైన విచారణ జరిపించిన జగన్ వెంటనే యాక్షన్ కి దిగిపోయార‌ట. దీంతో మంగళగిరి తాశీల్దార్ రాం ప్రసాద్ టీడీపీ ఆఫీస్ పెద్దలకు తాజాగా నోటీసులు జారీ చేశారట. 


ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని, అక్కడ నిర్మించిన కట్టడాలను తక్షణం కూలగొట్టకపోతే తామే రంగంలోకి దిగుతామంటూ నోటీసులు ఇచ్చేశారట. ఇక చూస్కో నా సామిరంగా అన్నట్లుగా ఉంది టీడీపీ పరిస్థితి అంటున్నారు. అంటే మరో ప్రజావేదిక మాదిరిగా ఇక్కడ కూడా కూలగొట్టుడుకు జగన్ రెడీ అన్నమాట. చూడాలి మరి టీడీపీ తమ్ముళ్ల ఏడుపులు. ఈసారి కూడా భూమినీ ఆకాశాన్ని కలిపేసేలా రోడ్డు మీదకు గొడవలకు దిగిపోతారో ఏంటో.




మరింత సమాచారం తెలుసుకోండి: