సెప్టెంబర్ 23న హుజుర్నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రంజిత్ కుమార్ విడుదల చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహిస్తుండగా, 19వ తేదిన ప్రచారం ముగియనుంది. 24వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ మేరకు హుజర్ నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల ఏర్పాట్లను చేసింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఏడు మండలాలున్నాయి. నేరేడుచర్ల మండలం లో మొత్తం ఓటర్లు 34,087 మంది కాగా పోలింగ్ స్టేషన్ లు 43 ఏర్పాటు చేశారు. పాలకీడు మండలంలో ఓటర్లు 19,639 ఉండగా 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మఠం పల్లి మండలంలో 34,855 ఓటర్లకు 43 పోలింగ్ కేంద్రాలు, మేళ్ళచెరువు మండలంలో ఓటర్లు 31,270 ఉండగా పోలింగ్ కేంద్రాలు 41 ని ఏర్పాటు చేశారు. చింతల పాలెం మండలంలో ఓటర్లు 25,228 మందికి పోలింగ్ కేంద్రాలు 36 ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మండలంలో ఓటర్లు..47,886 ,పోలింగ్ కేంద్రాలు..57 . గరిడే పల్లి మండలంలో ఓటర్లు...43,877 , పోలింగ్ కేంద్రాలు..57 లను ఏర్పాటు చేశారు.
పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ అర్బన్ ఏరియాలో 31 , రూరల్ లో 271 చొప్పున మొత్తం..302 ఉన్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే..నార్మల్...223 , సమస్యాత్మక కేంద్రాలు 79 ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు పిఓలు 392 , ఎపిఓలు 392 , ఓపిఓ లు 392 , ఎస్ ఓఎస్ లు 27+1 , ఎస్ ఎస్ టీలు 9 , ఎఫ్ ఎస్ టీలు 7 , ఎంసిసి 7 ,విఎస్ టీలు 8 , వివిటిలు 1 , ఏటీ 2 , ఏఈఒలు 3 మంది, రూట్ అధికారులు 27 మంది, రూట్లు. 27+1 లకు మొత్తం 104 ప్రచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం పది కేసులు నమోదయ్యాయి. సి.విజిల్ ద్వారా వచ్చిన కేసులు..15 కాగా మొత్తం నగదు సీజ్డ్..72,29,500 లు. ఈ ఎన్నికల్లో మొత్తం ఈ విఎంలలో బియూలు 967 , సియూలు363 , వివిపిటిస్ 378 ని ఉపయోగిస్తున్నారు.