అభివృద్ధి పనుల్లో భాగంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది, ప్రభావిత ప్రాంతాల్లో నీటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్న మార్గాలు జలమండలి ఏర్పాట్లు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిలో ముఖ్య భూమిక పొషిస్తున్న గోదావరి జలాల సరఫరాలో అంతరాయం. ముఖ్య కారణం ఏమి అనగా కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ-13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగుతుంది.
గజ్వేల్ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ ఈ కెనాల్ నిర్మాణానికి అడ్డుకోడల ఉంది. దీంతో ఈ భారీ పైపులైన్ ఇతర చోటికి తరలిస్తున్న క్రమంలో ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులు మూడు రోజుల పాటు సరఫరా మానేయడం జరుగుతుంది. ఈ నెల 16వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది అని ప్రజలకు తెలియ చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నీటి తరలింపులో అంతరాయం ఏర్పడింది, ప్రభావిత ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు జలమండలి ఏర్పాట్లు చేస్తుంది అని తెలియచేస్తున్నారు.
.
ఇక అంతరాయం కలిగే ప్రాంతాలు విషయానికి వస్తే... ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, ఆమీర్పేట, బంజారాహిల్స్, సనత్నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట,
బాలా నగర్, భాగ్య నగర్, భరత్ నగర్, సనత్ నగర్, బోరబండ రిజర్వాయర్ పరిధి, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, జగద్గీరిగుట్ట, కుత్భుల్లాపూర్, పేట్ బషీరాబాద్, ఢిఫెన్స్ కాలనీ, గౌతం నగర్, ప్రశాంత్ నగర్, చాణక్యపురి , మల్కాజ్గిరి, ఫతర్బాలాయి నగర్, అల్వాల్, న్యూ ఓయూటీ కాలనీ, కైలాసగిరి, హఫీజ్పేట, మియాపూర్, మాతృశ్రీ నగర్, మయూరి నగర్, చందా నగర్, ఆర్సి పురం, పటాన్చెరు, బోలారం, మయూరి నగర్, నిజాంపేట,
ప్రగతి నగర్, బాచుపల్లి, బోల్లారం, ఆమీన్పూర్, మల్లంపేట, జవహర్ నగర్, బాలాజీ నగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల్, ఆర్జికే, అహ్మద్గూడ, దేవరాయాంజల్, తూంకుంట, ఎన్ఎఫ్సి, పోచారం, సింగాపూర్ టౌన్షిప్, మౌలాలీ, లాలాపేట, తార్నాక, సీఆర్పిఎఫ్, మెస్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాలలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుంది.
కాబట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు.