జగన్ తీసుకొనే నిర్ణయాలు ఒక్కో సారి రాజశేఖర్ రెడ్డి గారిలానే ఉంటాయి అని అందరూ అంటుంటారు.అలా ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం అద్బుతం అయ్యేలా ఉంది. రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళనకు నడుం బిగించారు. అవినీతి, మధ్యవర్తుల కమీషన్లు, ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు చేపడుతున్నారు. ఇక నుంచి క్రయ, విక్రయదారులు స్వయంగా తన డాక్యుమెంట్‌ను తాను తయారు చేసుకొని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విధానం అమల్లోకి తేవడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటుకు రంగాన్ని రెడీ చేస్తున్నారు.

ఏపీలో నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలులోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత ఆస్తుల క్రయ విక్రయదారులు స్వయంగా పత్రాలు తయారు చేసుకొని ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించేలా సేవలు అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద గంటలు, రోజుల కొద్ది వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉండవు.

ఆన్‌లైన్‌లో తమ క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంటేషన్ తయారు చేయడమే కాదు, దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్ లోడ్ చేయడం ద్వారా టైమ్ స్లాట్‌ను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానం అమలు చేశారు. లోపాలను గుర్తించి, సవరణలు చేశారు.

ఈజీ రిజిస్ట్రేషన్... అందుబాటులో డాక్యుమెంట్స్ రాసుకొనే కొత్త పద్దతులు వల్ల ఒక విప్లవాత్మక మార్పు అభివృద్ధి దిశ గా రాష్ట్రం ముందడుగు వేస్తుంది అని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: