ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె రోజురోజుకి ఉధృతమవుతోందనే చెప్పాలి. తాము విధించిన గడువులోగా విధులకు రాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వర్కింగ్
కేసీఆర్ సర్కారు అన్నంత పని చేయడంతో పాటుగా కొత్తగా కార్మికుల నియామకాలను కూడా చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి ఆదివారం చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణ సర్కారును బయపెటింది అనే చెప్పాలి. ఇదే సంఘటనను ఆధారం చేసుకుని టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ - మాజీ ఎంపీ
విజయశాంతి భావోద్వేగానికి గురయ్యారు.
శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై రాములమ్మ భావోద్వేగం ఎలా సాగిందన్న అసలు విషయానికి వస్తే... తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని
విజయశాంతి తనదైన రీతిలో చెప్పారు.
ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్ కి బాగా తెలిసిన
విద్య కానీ... వాటిని చూసి చలించే తత్వం లేదనే విషయం పలు సందర్భాల్లో తెలుస్తుంది అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రాణత్యాగం చేసి ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే... బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని
విజయశాంతి వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణ త్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే.. కేసీఆర్ స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దంపడుతోందని అని విజయశాంతి ఆరోపణలు చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా మరో వారం రోజుల పాటూ పాఠశాలలకు
దసరా సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని నిజంగా ప్రభుత్వం ప్రయత్న ఏర్పాట్లు చేసి ఉంటే స్కూళ్లకు సెలవులు ఎందుకు పొడిగించారో వివరణ ఇవ్వాలని
విజయశాంతి డిమాండ్ చేయడం జరిగింది.