తెలంగాణలో మరో చండీయాగం మొదలైపోయింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణాపురం పరిధిలోని ఓ మామిడి తోటలో ఈ యాగాన్ని మొదలెట్టింది ఎవరన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది అందరిలోనూ. బిజినెస్ లో తనదైన శైలి విజయాలు నమోదు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి... మొదటిలోనే  ఎంపీగా విజయం సాధించి సత్తా చాటిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యాగాన్ని  నిర్వహించారు.


శ్రీనివాసరెడ్డి మామిడి తోటలోనే  యాగశాలను నిర్మించిన పొంగులేటి రుత్విక్కులతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది.  ఈ చండీయాగం  ఐదు రోజుల పాటు కొనసాగతుంది. అంతేకాదండోయ్... ఈ యాగానికి రావాలంటూ ఆయన ఏకంగా సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించడం జరిగింది. 9 మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్న ఈ యాగానికి చినజీయర్స్వామి విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ధర్మపురి సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి తదితరులు హాజరు అయ్యారు.


టీఆర్ఎస్ లో చేరిన మొదటిలో ఓ మోస్తరుగా హెుషారుగా కనిపించిన పొంగులేటి ఆ తర్వాత క్రమంగా తెర వెనుకకు పోయారు.ఇటీవల  ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే... కాంట్రాక్టర్ గా వ్యాపారవేత్తగా తనదైన శైలి విజయాలను నమోదు చేసిన పొంగులేటికి రాజకీయాలు మాత్రం కలిసి రాలేదనే తెలుస్తుంది. మరి బిజినెస్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ మాదిరే... పాలిటిక్స్ లోనూ కెరీర్ బాగుండాలంటే ఎలాంటివి చేయాలి? ఇంకేం చేయాలి? అనుకోని చండీయాగం చేస్తున్నారు.


తెలంగాణలో ఇప్పుడంతా ఇదే భావన కనిపిస్తుంది. స్వయంగా సీఎం హోదాలో ఉన్న కేసీఆరే నిత్యం యాగాలంటూ చేసుకుంటూ పోతుంటే.. మిగిలిన వారు కూడా అదే బాట పడతారు ఏమో కదా. ఇప్పుడు పొంగులేటి కూడా కేసీఆర్ బాటనే ఆశ్రయించి చండీయాగానికి శ్రీకారం చుట్టారు అనిపిస్తుంది. మరి ఈ యాగంతో పొంగులేటి పొలిటికల్ కెర్రిర్ ఏ మాత్రం  మారుతుందో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: