151 సంఖ్య.. ఇది కేవలం ఓ అంకే మాత్రమే.. దీనికి అంతగా విశేషం ఏముంటుంది.. వరుస క్రమంలో వచ్చే సంఖ్యతో ఏదో విశేషం ఉందని ఒకటే ఊదర గొడుతున్నారు అనుకుంటున్నారా.. అవును ఇది ఊదరగొట్టే విషయం కాదు.. ఈ విశేషం మీరు వింటే ఆశ్చర్య పోవాల్సిందే. ఇది ఏపీ, సిని చరిత్రలో నిలిచిపోయే సంఖ్య. అంటే అటు రాజకీయంగా, ఇటు సిని పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే ఈ సంఖ్య కు భలే క్రేజ్ వచ్చింది ఈ రోజు. అవునా.. ఇంతకు ఈ సంఖ్యకు ఉన్న అంత విశేషం ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఓసారి లుక్కేద్దాం...
నవ్యాంధ్రప్రదేశ్లో 2019లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అంతకు ముందు అధికారంలో ఉన్న టీడీపీకి ఈ ఎన్నికలు ఓ పీడ కలనే మిగిల్చాయి.. టీడీపీ పీడకలను మిగిల్చితే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మాత్రం నమ్మకశ్యం కానీ రీతిలో గెలుపు సాధించింది. అంటే ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని తిరుగులేని విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంటే ఏపీలో అధికార బదలాయింపులో వైసీపీ సాధించిన సీట్లు 151. అంటే ఈ సంఖ్య సాధించిన విజయంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీఎంగా అధికార పీఠం అధిష్టించారు.
ఇక అధికారంలో ఉన్న టీడీపీకి ఈ సంఖ్య ముచ్చెమటలు పట్టించింది. అంటే రాజకీయంగా ఈ సంఖ్య కు ఎంతో విశిష్టత ఉంది. దీనికే అంత విశేషమా.. అనుకుంటున్నారా..ఇప్పుడు సిని పరిశ్రమలో మకుటం లేని మహారాజు గా కీర్తిని అందుకుంటున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవల
చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్యకమైన చిత్రం సైరా. మెగాస్టార్
చిరంజీవి కలల ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంకు దాదాపు 12ఏండ్ల క్రితం పునాది పడిందట. కానీ అది నెరవేరడానికి ఇంత కాలం పట్టింది. అంటే మెగాస్టార్ ఈ చిత్రాన్ని తన కేరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే ఇది మెగాస్టార్
చిరంజీవి కేరీర్లో 151వ చిత్రం. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద వసూళ్ళతో దూసుకుపోతుంది. సిని చరిత్రలో 151వ చిత్రంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి. రాజకీయ రంగంలో 151 ఎమ్మెల్యే సీట్లతో భారీ విజయాన్ని అందుకున్న ఏపీ సీఎం జగన్ లు ఇద్దరు ఈరోజు భేటీ అయ్యి రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపారు. సో 151 సీట్లలో సీఎం జగన్, 151 సినిమాతో
చిరంజీవి తన కేరీర్ను కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు ఈ ఇద్దరు ఈరోజు సీఎం జగన్ ఇంట్లో భేటి కావడం విశేషం. 151 ఈ ఇద్దరి కేరీర్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే ఈ సంఖ్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.