పదవిలోకి వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని సంచలనమైన మరియు మంచి నిర్ణయాల్లో గ్రామ మరియు పట్టణ సచివాలయాల ద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న అంశం హైలెట్ గా నిలిచింది. అయితే ఏ పనినైనా సగం చేసి వదిలి పెట్టడం ఇష్టం లేని జగన్ ఈ నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని సంకల్పించినట్టు ఉన్నాడు. మరికొంత మంది నిరుద్యోగులు ఇళ్లల్లో నవ్వులు పూయించేలా గ్రామ సచివాలయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నాడు.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయం నియామక ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామ వాలంటీర్ పోస్టులకు ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు గతంలో నియామకాలు పూర్తి కాగా మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరో సారి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏపీలో 1,94,592 గ్రామ వాలంటీర్ల ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే వాళ్లు 184944 మంది మాత్రమే వీధిలో చేరడంతో 9648 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు జిల్లా వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

దీని ప్రకారం మొత్తం 9648 ఖాళీలలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1862 ఉండగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 200 ఖాళీలు ఉన్నాయి.200 ఖాళీలు ఉన్నాయి డిసెంబర్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ వెలువడనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అభ్యర్థుల నుంచి జూన్ 24 నుంచి జులై 5 వరకు దరఖాస్తులను స్వీకరించారు. పట్టణ వాలంటీర్ ఉద్యోగాలకు జూలై 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు అనంతరం జులై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఎంపికైన వారిలో కొంతమంది సరైన అభ్యర్థులు లేని కారణంగా నియామకాలు జరగలేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: