పాత హిట్ సినిమా అన్ని తిరిగి థియేటర్లలో రిలీజ్ చేయాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది. భారత ఆర్థిక పరిస్థితి చక్కబడాలంటే ఇదే సరైన చర్య". ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినపడుతున్న టాపిక్ మరియు కామెంట్లు ఇవి. బాక్సాఫీస్ క్యాబినెట్ అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేసి మరీ కేంద్రంలో బీజేపీ సర్కార్ ని దుమ్ము లెప్పుతున్నారు నెటిజన్లు. భరత్ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది, దీనికి బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు అధికారులు  చేస్తున్న విమర్శలను తన దైన శైలిలో తిప్పికొట్టి ఈ వివాదానికి ముఖ్య  కారణం అయ్యారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.


ఇక విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, కావాలంటే అక్టోబర్ 2న విడుదలైన మూడు బాలీవుడ్ సినిమాల కలెక్షన్లు చుడండి, ఒక్కొకటి 120 కోట్ల రూపాయలు వసూలు కూడా  చేశాయి. ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలంటూ రవిశంకర్ ప్రసాద్ నోరు పారెయ్ సుకున్నారు . అంతే గంటల వ్యవధిలోనే ఈ కామెంట్లు ఒక పెద్ద  వైరల్గా మారింది. బాలీవుడ్ సినిమాల కలెక్షన్లు బాగుంటే చాలు, దేశం బాగున్నట్టేనంటూ సాక్షాత్తూ కేంద్ర మంత్రే మాట్లాడారని ప్రతిపక్షాలు అధికారులు విమర్శల కామెంట్స్ పెట్టారు.


సోషల్ మీడియా పుణ్యమా అని రవిశంకర్ ప్రసాద్ పరువు కాస్త బజారున పడింది అని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా.. వెంటనే మరో ప్రెస్ మీట్ పెట్టినా అభిప్రాయం అదికాదు, నా మాటల్ని వక్రీకరించారంటూ తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా మరో అడుగు ముందుకేసి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు కూడా తెలిపారు రవిశంకర్ ప్రసాద్. నేను సున్నిత మనస్కుడిని కాబట్టి, ఇలాంటి వివాదాలు నాకు బాగా బాధ కలిగించింది. అందుకనే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని తెలియచేశారు.


కానీ అయితే అప్పటికే  నెటిజన్లు రవిశంకర్ ప్రసాద్ నీ బీజేపీ సర్కార్ నీ ఒక రేంజ్లో  ఆడుకున్నారు అంటే నమ్మండి. బాక్సాఫీస్ క్యాబినెట్ అంటూ ఓ రౌండ్ కూడా వేశారు. చాలా చాకచక్యంగా మాట్లాడే రవిశంకర్ ప్రసాద్, ఈసారి మాత్రం ప్రతిపక్షాలకు ఇలా అడ్డంగా బుక్ అయ్యిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: