కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో జీవోఎం భేటీ ముగిసింది. యూపీఏ అధ్యక్షురాలితో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని ఆమె పట్టుపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యలో కేంద్ర మంత్రుల బృందం జివోఎం సభ్యులు ఎకె ఆంటోనీ సుశీల్ కుమార్ షిండే పి. చిదంబరం  జైరాం రమేష్‌లతో పాటు తదితరులు సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు ముసాయిదాపై వారు సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది.తెలంగాణ బిల్లును ప్రత్యేక సమావేశాలకో మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకో వాయిదా వేయడం మంచిది కాదని అలా వాయిదా వేస్తే అడ్డంకులు తీవ్రం కావచ్చునని సోనియా చెబుతున్నట్లు సమాచారం. సమైక్యవాదులు తమ విజయంగా ప్రకటించి మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని దాంతో తెలంగాణలో పరిస్థితులు విషమించే ప్రమాదం ఉంటుందని సోనియా అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: