చంద్రబాబునాయుడుకు సొంత పార్టీ ఎంఎల్ఏ పెద్ద షాకే ఇచ్చారు. వైసిపి ఎంపి పుట్టిన రోజు వేడుకలకు పచ్చపార్టీ ఎంఎల్ఏ హాజరవ్వటం జిల్లా పార్టీలోనే కాకుండా మొత్తం పార్టీలోనే పెద్ద చర్చనీయాంశమైంది. విషయం తెలిసినప్పటి నుండి చంద్రబాబు కూడా సదరు ఎంఎల్ఏ మీద మండిపోతున్నట్లు సమాచారం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఎలాగూ పార్టీ ఎంపి అందులోను ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి మాగుంట జన్మదిన వేడుకలకు వైసిపిలోని చాలామంది నేతలు హాజరయ్యారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంఎల్ఏలు కూడా చాలామందే హాజరయ్యారు.

 

అయితే ఇక్కడే సూపర్ ట్విస్టు మొదలైంది. ఏమిటంటే మాగుంట జన్మదిన వేడుకల్లో తెలుగుదేశంపార్టీ చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ కూడా హాజరయ్యారు. వేడుకల్లో తానొక్కడే పాల్గొనటం కాకుండా తన కొడుకు కరణం వెంకటేష్ ను కూడా తీసుకెళ్ళారు. ఒకవైపేమో వైసిపి అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా చంద్రబాబు అంతెత్తున్న మండిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఒకవైపు తమ అధినేత వైఖరిని చూస్తూనే మరోవైపు మాగుంట పుట్టినరోజు వేడుకలకు కరణం కొడుకుతో పాటు హాజరవ్వటం పార్టీలో సంచలనంగా మారింది. వేడుకల్లో కరణం పాల్గొన్నట్లు తెలియగానే తమ ఎంఎల్ఏ వైసిపిలోకి జంప్ చేయబోతున్నారా ? అంటూ పెద్ద ఎత్తున టిడిపిలో చర్చలు మొదలయ్యాయి.

 

ఎందుకంటే కరణం వైసిపిలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందే తాను కానీ లేకపోతే తన కొడుకు వెంకటేష్ కానీ వైసిపిలోకి జాయిన్ అయ్యేందుకు కరణం ప్లాన్ వేసినట్లు పెద్ద ప్రచారమే జరిగింది. అద్దంకిలో పోటి చేయటం కోసం కరణం వైసిపిలోకి వెళ్ళబోతున్నట్లు టిడిపి నేతలే చెప్పుకున్నారు.

 

సరే అలాంటిదేమీ జరగలేదనుకోండి అది వేరే సంగతి. అలాంటిది ఇపుడు కరణం మాగుంట దగ్గర హాజరవ్వటం అందులోను వేడుకలు పూర్తయ్యేవరకు ఉన్నారు. పైగా కరణం మాట్లాడుతూ మాగుంటను బ్రహ్మాండమంటూ పొగిడారు. దాంతో టిడిపిలో అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: