ఆర్టీసీ కార్మికుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో పడ్డారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. ఏం చేయాలో తెలియక కార్మికులు సతమతమవుతున్నారు. సమ్మె విరమించడమా.. లేక అలాగే ముందుకు సాగడమా.. లేక న్యాయం కోసం మరోమారు కోర్టు తలుపు తట్టడమా అనేది కార్మికులను వేధిస్తున్న సమస్య.. 

అయితే ఆర్టీసీ సమ్మె ను హైకోర్టు తప్పు పట్టింది. దసరా పండుగ సందర్భంగా సమ్మె చేయడం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడమేనని., ఇప్పుడు జరుగుతున్న సమ్మెతో ప్రభుత్వం - కార్మికుల మధ్య ప్రజలు నలిగి పోతున్నారని అందుకు సమ్మెను వెంటనే విరమించి  ప్రభుత్వంతో వెంటనే చర్చలకు వెళ్లాలని హైకోర్టు చూచించింది. నిరసన తెలుపడానికి అనేక మార్గాలుండగా - ఆఖరి అస్త్రం ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది కదా - ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారు - మీరు చేస్తున్న సమ్మె న్యాయమైందే కావొచ్చు.. న్యాయమైన డిమాండ్ల కోసమే సమ్మె చేస్తుండొచ్చు.. పండుగ పూట ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతా?? అంటూ హైకోర్టు కార్మిక సంఘాలను ప్రశ్నించింది.

ఆర్టీసికి పూర్తి స్థాయి ఎండీ లేరని - వారి సమస్యలు ఎవ్వరికి చెప్పుకోవాలని - అందుకే ఆఖరి ఆస్త్రంగా సమ్మె చేస్తున్నామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం మాత్రం పండుగ పూట సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని అయినా కూడా బస్సులు పూర్తిస్థాయిలో నడుపుతున్నామని - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని - సమ్మెతో బడులకు సెలవులు ఇచ్చామని హైకోర్టుకు తెలిపింది. అసలు బస్సులు పూర్తిస్థాయిలో నడిస్తే బడులకు ఎందుకు సెలవులు ఇచ్చారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ముందు కార్మికులను చర్చలు పిలవాలని - వారి సమస్యను పరిష్కరించాలని - ఆర్టీసీకి వెంటనే పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చర్చలకు పిలిస్తే మేము వెళ్లేందుకు సిద్దమే., కాని ప్రభుత్వమే చర్చలకు పిలవడం లేదని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలుపగా ఈ కేసును ఈనెల 18 కి వాయిదా వేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: