సరికొత్త నిర్ణయాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రివర్స్ టెండర్ , రివిజన్ ఆఫ్ పీపీఏ ల ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు. ఒక పక్క రాష్ట్రానికి మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరోపక్క ఖజానాపై ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్న జగన్ తీరు దిగ్గజ నేతలనే ఆశ్చర్యపరుస్తోంది. వైయస్ జగన్ ప్రభుత్వం భారమైన పీపీఏల విషయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని చూసి యోగీ వంటి యూపీ మంత్రులు కూడా జగన్ ను ఫాలో అయిపోతున్నారు.


అధిక ధరలతో ఉన్న గత విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్షకు సిద్ధ పడుతున్నారు. ఈ సమయంలో జగన్ కు మరో గుడ్ న్యూస్ అందింది. పీపీఏల విషయంలో కేంద్రం మొండిపట్టుదలకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అటు కేంద్ర విద్యుత్ శాఖ తెగ కంగారు పడుతున్నాయి. తాజాగా మరోసారి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి లేఖలతో మరోసారి తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది.


సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ముందస్తు చెల్లింపులకోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి తీరాలని పట్టుబడుతూ రాష్ట్రానికి లేఖ రాసింది. లేకుంటే బహిరంగ మార్కెట్ లో కొనుగోళ్లను నిలువరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఏస్సీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హైకోర్టును ఆశ్రయించారు. బకాయిల చెల్లింపుల విషయంలో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44, పవన విద్యుత్ రూ.2.43 చొప్పున చెల్లింపులకు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులిచ్చిన ఈ విషయాన్ని కోర్టు ముందుంచారు.


రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, వీలును బట్టి బకాయిలు చెల్లిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తూ, విద్యుత్ కొనుగోళ్లను అడ్డుకోవద్దని కేంద్రానికి ఉత్తర్వులిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: