హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, భారీ మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామంటున్న టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బహిరంగసభకు ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించేందుకు  సర్వం సిద్ధం చేసినట్టు ఏర్పాట్లను పరిశీలించిన ఉప ఎన్నికల టీఆర్‌ఎస్ ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనతో పాటుగా మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ పరిశీలించారు. ఈ సందర్బంగా  పల్లా మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ మాయమాటలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.



ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. మిగతా పార్టీల కంటే కూడా దూసుకుపోతున్నది. అభ్యర్థి సైదిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు చుట్టిరాగా, మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు రోడ్‌షోలు, సభలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో  సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం టీఆర్‌ఎస్ శ్రేణు లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటం, బహిరంగసభకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రచారం మరింత జోరందుకోనున్నది. గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్‌లో నిర్వహించే ఉప ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ప్రసంగిస్తారు.



కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు. మేళ్లచెర్వు మండలంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రచారం నిర్వహించారు. గరిడేపల్లి మండలంలో మండలి చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ప్రచారంలో పాల్గొన్నారు. చింతలపాలెం మండలంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, బాపూరావు రాథోడ్, ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ బండ్ల ప్రకాశ్, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, నేరేడుచర్లలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, రాజయ్య, పాలకవీడు మండలంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: