అయోధ్యకేసుపై సుప్రీం  కోర్టులో వాదనలు ముగిసాయి. కానీ తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. నేడు తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ నేటితో ముగింపు పలకనుంది. అయోధ్య కేసులో చివరిరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా కోన సాగాయి. అయితే తీర్పును మాత్రం సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. 


అయితే డెడ్ లైన్‌కు ఓ గంట ముందే కోర్టు వాదనలు ముగించింది.  వరుసగా 40 రోజుల పాటు వాదనలు జరిపింది న్యాయస్థానం. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోప వాదనలను బుధవారంతో ముగిస్తామని తెలియచేశారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి  తెలిపారు.


నవంబర్ 17వ తేదీన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేస్తున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది అని సమాచారం. లేని పక్షంలో ఈ కేసును కొత్త ధర్మాసనం ముందు తిరిగి మొదటి నుంచి మొదలుపెట్టి వివరించాల్సి వస్తుంది. గత 39 రోజులుగా సాగుతున్న అయోధ్య కేసును మొదట్లో అక్టోబర్ 18 నాటికి ముగించాలని ధర్మాసనం భావించడం జరిగింది. ఆ తర్వాత గడువును కొంచం ముందుకు అక్టోబర్ 17కు జరిపారు. ఇక ఈ వివాదం పై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే కదా.


అయోధ్య రామమందిర నిర్మానం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో తెలియచేశారు అప్పటిలో. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు మళ్ళీ దాఖలు అవ్వడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: