పెద్దలసభలో ఎన్​డీఏ బలం బాగా పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు క్రమంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న తరుణంలో రాజ్యసభ గతంలో కన్నా మోదీ ప్రభుత్వానికి బాగా అనుకూలంగా మారింది. అధికార ఎన్డీఏకు సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ స్నేహపూర్వక ప్రాంతీయ పార్టీల మద్దతుతో సౌకర్యవంతంగానే ఉంటుంది. విపక్ష పార్టీ ఎంపీల రాజీనామాల కారణంగా రాజ్యసభలో మోదీ ప్రభుత్వం మెల్లమెల్లగా బలపడుతోంది అని అర్థం అవుతుంది. ప్రస్తుతనికి  ఎన్​డీఏ ప్రభుత్వానికి సంఖ్యా బలం తక్కువగానే ఉన్నా ఎప్పుడు లేనంతగా సౌకర్యంగా ఉంది అనే చెప్పాలి. ప్రస్తుతానికి మిత్రపక్ష ప్రాంతీయ పార్టీల మద్దతుతో సురక్షిత స్థానంలో ఉంది.


మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో విపక్షాలు ఐక్యంగా ఉండడం జరిగింది. రాజ్యసభలో ప్రభుత్వ ఎజెండాను అడ్డుకోగలిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితి బాగా మారిపోవడం జరిగింది. పార్టీ మార్పిడి, రాజీనామాల సహకారంతో క్రమంలో రాజ్యసభలో బలాన్ని పెంచుకుంటోంది బిజెపి. ఇదే దారిలో మొదటి పార్లమెంట్ సెషన్​లో పెద్దఎత్తున బిల్లులను ఆమోదించుకోవడం కూడా జరిగింది ఎన్​డీఏ ప్రభుత్వం.  

ఎన్డీఏకు మద్దతుగా 106 మంది...పార్లమెంటు శీతకాల సమావేశాలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధం అవుతున్న వేళ మరో కాంగ్రెస్ ఎంపీ బుధవారం రాజీనామా చేయడం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి రాజీనామాతో రాజ్యసభలో హస్తం బలం 45కు పడిపోవడం జరిగింది. 


ఇక రాష్ట్రంలో మెజారిటీ కారణంగా ఈ స్థానానికి ఉపఎన్నికలు జరిగితే భాజపా ఎగరేసుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే జరిగితే మాత్రం రాజ్యసభలోని 245 సీట్లకు గాను భాజపా మెజారిటీ 83కు చేరుకుంటుంది అని అంచనా. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం 106గా ఉంది. 5 ఖాళీలు ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల మద్దతు...ఎన్డీఏలో భాగస్వామిగా లేకున్నా అన్నాడీఎంకే ప్రభుత్వానికే మద్దతుగా నిలపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: