ఈ మద్య కొంత మంది చేస్తున్న సాహసాలు చూసి నవ్వాలో..ఏడ్వాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది.  అది వారికి సాహసంగా అనిపించినా అనుకోని ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో అవతలివారు టెన్షన్ పడిపోతుంటారు. ఇటీవల కాలంలో టిక్ టాక్ కోసం పిచ్చి సాహసాలు చేసి కొంత మంది హాస్పిటల్ పాలయితే..మరికొంత మంది ఏకంగా ప్రాణాలే పొగొట్టుకున్నారు.  ఇక కొంతమంది వెర్రిసాహసాలు చూస్తే నిజంగా వీరికి పిచ్చిపట్టిందని అనుకుంటారు.

తాజాగా  ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన ఓ యువకుడిని చూసి చుట్టు పక్కల వారు కంగారు పడ్డారు. వెంటనే అక్కడ  జూ సిబ్బంది తేరుకొని ఆ యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వెదురు కంచె ఎక్కి సింహం ఎన్‌క్టోజర్‌లోకి దూకిన ఆ యువకుడు సింహం ముందు కూర్చుని ఉండడాన్ని చూసిన సందర్శకులు పెద్దపెట్టున హాహాకారాలు చేశారు.

ఇది చూసిన సందర్శకులు వెంటనే గట్టిగా అరవడంతో ఆ సింహం అక్కడే ఆగిపోయింది..వెంటనే జూ సిబ్బంది అలర్ట్ కావడంతో ఫారెస్టు రేంజర్లు వెంటనే లోపలకు దూకి ఆ యువకుడిని రక్షించారు.  కాకపోతే ఇక్కడ అదృష్టం ఏంటంటే..ఆ యువకుడిని సింహం ఏమీ అనకుండా అలా చూస్తు నిల్చుంది.  బీహార్‌కు చెందిన ఆ యువకుడిని పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నామని ఆగ్నేయ ఢిల్లీ డిసిపి చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: