వరణుడి దెబ్బకు నేడు హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించవలిసిన బహిరంగ సభ రద్దయ్యింది.హుజూర్‌నగర్‌లో భారీ వర్షం కురవడంతో సభా వేదికను ఏర్పాటు చేసిన ప్రాంతం అంతా   నీటితో నిండిపోయింది. దీంతో సభను రద్దు చేస్తున్నట్లు తెరాస నాయకులు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు తర్వాత వచ్చిన ఎన్నికలు కావటం వలన ఈ ఎన్నికలో విజయం సాధించాలి అని  అన్నీ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 


ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సభ వర్షం కారణంగా రద్దయ్యింది. గంటకు పైగా కుండపోత వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం అస్తవ్యస్తమైంది. దీనితో సభను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సభ కోసం తెరాస శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక ముందు సత్తా చూపాలని భావించింది. ఈ సభను ట్రెండ్ సెట్టింగ్ సభగా టీఆర్ఎస్ నాయకులు కూడా అభివర్ణించారు. 


కానీ గులాబీ నేతల ఆశలపై వరణుడు నీరు చల్లాడు. భారీగా కురిసిన వర్షం కారణంగా సభా ప్రాంగణం అంత బురదమయంగా మారింది. ఆకాశంలో మబ్బులు కమ్మేయడంతో మళ్లీ వర్షం పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనితో సభ రద్దు అయినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. వాతావరణం సరిగా లేకపోవడంతో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ వెళ్లడానికి ఏవియేషన్ శాఖ అనుమతులు అసలు ఇవ్వలేదు. దీనితో పైలెట్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.


హూజూర్ నగర్ లో భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఈ ముఖంగా తెలిపారు. అక్టోబర్ 21 న హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక జరగనుండగా శనివారంతో ప్రచారం ముగిసి పోతుంది. ఎన్నికల తేదీ దగ్గరకి రావడంతో  పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగాయి.ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24 న ప్రకటిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: