తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు దసరా పండుగ ముందు సమ్మెకు దిగడంతో... ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అద్దె  ప్రైవేటు బస్సులను తిప్పింది ప్రభుత్వం. అయితే ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రభుత్వం... ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అదే ప్రైవేటు బస్సు తిప్పుతుంది. కాగా  ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు అందరు సమ్మెలో పాల్గొంటునటంతో ... తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు నియమించింది ప్రభుత్వం . ఈ నేపథ్యం లో అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. 

 

 

 

ప్రభుత్వం నడిపిస్తున్న బస్సులో ప్రయాణించాలంటే  ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని...ప్రయాణిస్తున్నారు. అయితే తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన దాని కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు . ఇక మద్యం మత్తులో  బస్సులు నడపడం... నిర్లక్ష్యంతో అతివేగంగా బస్సును నడపడంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు . ఇదిలా ఉంటే తాజాగా ఓ  తాత్కాలిక డ్రైవర్ మరో ఘనకార్యం కూడా చేశారు. ఓ మహిళ కండక్టర్ పై లైంగిక దాడి చేసాడు తాత్కాలిక డ్రైవర్.

 

 

 

 

 మంచిర్యాల జిల్లా బస్సు చెన్నూరు నుండి మంచిర్యాల వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణికులు ఎవ్వరు ఎక్కకుండా ముందు జాగ్రత్త పడ్డాడు తాత్కాలిక డ్రైవర్. అయితే మార్గమధ్యంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో బస్సును ఆపి... మహిళా కండక్టర్ పై లైంగిక దాడికి దిగాడు. అయితే ప్రతిఘటించిన బాధితురాలు అతని  నుంచి తప్పించుకుని జైపూర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిపింది . ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కొంత మంది తాత్కాలిక సిబ్బంది తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని పలువురు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: