లలితా
రాణి గా పుట్టి
జయప్రద గా పేరు మార్చుకొని తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అందాల
తార మన జయప్రద. అందం, అభినయం ఈమె సొత్తు. అంతులేని కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ
తార అనంతమైన ప్రేక్షకులను సొంతం చేస్కుంది. శ్రీదేవి
విజయ నిర్మల వంటి గొప్ప గొప్ప నటీమణులు సైతం ఈమెను చూసి ఈర్ష్య పడ్డారంటే అది అతిసయోక్తి కానే కాదు. కేవలం వెండితెరపైనే కాకుండా రాజకీయాల్లో కూడా తన మార్క్ ను చూపించుకున్నారు మన జయప్రద.
ఇటీవల సమాజ్వాదీ పార్టీ ముఖ్యనేత, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్పై బీజేపీ నేత, మాజీ ఎంపీ
జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజం ఖాన్ వల్ల ఎంతో మంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని.. వారి పాపాలే ఆయనకు శాపాలుగా మారాయని
జయప్రద విమర్శించారు. మహిళల కారణంగానే ఆయనపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయని
జయప్రద వ్యాఖ్యానించారు. అందుకే ఆయన ఇప్పుడు ఎన్నికల సభల్లో ఏడుస్తున్నారని
జయప్రద ఆరోపించారు. ఒకప్పుడు తనపై మంచి నటి అంటూ సెటైర్లు వేసిన ఆజం ఖాన్పై
జయప్రద తనదైన శైలిలో గట్టిగానే విమర్శించారు. తాను సినిమాల్లో నటించిన దాని కంటే కూడా ఎన్నికల సభల్లో ఆజం ఖాన్ బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల సభలో పాల్గొన్న జయప్రద... ఆజంఖాన్ పై ఈ వ్యాఖ్యలు చేశారు.
జయప్రద, ఆజంఖాన్ మధ్య చాలా కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ... విరివూరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. గతంలో సమాజ్వాదీ పార్టీ తరపున రాంపూర్ ఎంపీగా విజయం సాధించిన జయప్రద... గత లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జయప్రదపై ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆజం ఖాన్... ఆమెపై విజయం పొందారు. ఏది ఏమైనా మన
జయప్రద మాత్రం ఎప్పటికప్పుడు ఆజంకు గట్టి పోటీనే ఇస్తున్నారు.