వైసీపీ అధినేత పాలనపై విషం చిమ్ముతున్న ఎల్లో మీడియాపై వైసీపీ నేతలు, మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ మీడియా కళ్లుమూసుకుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఓ 11 ప్రశ్నలను విడుదల చేశారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రశ్నలు ఇవే.
1. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే 18 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లు చనిపోయారు. దానిపై స్పందించారా..?
2. మానవహక్కుల హననం జరిగిందని రాశారా..? టీడీపీ ఎంపీలు వెళ్లి మానవహక్కులు కాలరాస్తున్నారని బెస్లెస్ కంప్లయింట్ ఇస్తే దాన్ని పెద్ద హైలెట్ చేశారు.
3. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. దానికి కారకులైన వారి గురించి రాయకుండా చంద్రబాబు అక్కడే ఉండి వచ్చిన వారు స్నానాలు, పూజలు చేసుకునేట్లు కంట్రోల్ రూమ్ పెట్టి కష్టపడి పనిచేశారని రాశారు.. 29 మంది చనిపోయేందుకు కారణం ఎవరు రాశారా..?
4. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 23 మంది ఫిరాయింపులకు పాల్పడితే రాశారా..? దీనిపై వార్తలు రాయాలని అనిపించలేదా..? ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం ఉంటుందా..? ఫిరాయింపుదారుల్లో నలుగురిని మంత్రులను చేస్తే బాబు ప్రభుత్వాన్ని విమర్శించలేరా..?
5. ఓటుకు నోటు కేసు.. ఇది ప్రపంచమంతా చూసింది. దాంట్లో చంద్రబాబు తప్పు చూపించారా..?
6. ఆర్థికలోటులో రాష్ట్రంలో ఉంటే.. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రైవేట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరుగుతూ ప్రజలపై భారం వేస్తూ దుబారా ఖర్చు చేస్తుంటే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని చెప్పారా..?
7. చంద్రబాబు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు బోగస్ అని రాసే ధైర్యం లేదా మీకు..?
8. కాల్మనీ కేసుల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతమంది లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇవన్నీ తెలియదా..? దాని గురించి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియదా..? నిజమైన సంఘటనలు, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పత్రికలపై లేదా..?
9. రాజధానిలో రైతుల భూముల కొనుగోలు చేసేటప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అది రాసే ధైర్యం లేదా..?
10. మీకు నచ్చిన వ్యక్తిని ప్రమోట్ చేసి అతను అధికారంలోకి రావాలని జర్నలిజం విలువలు కూడా కాలరాసి చంద్రబాబు భజన చేశారు. ఈ ఐదేళ్లు భజన చేస్తే వచ్చింది అసెంబ్లీ ప్రసారాల కాంట్రాక్టు సంపాదించుకున్నారు.
11. ఓ పత్రికా అధినేత చెప్పిన వారికి టికెట్ ఇప్పించే పరిస్థితి తీసుకువచ్చారే.. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పాత్ర మీడియా అధినేతలు పోషించవచ్చా..?