విపరీత పోరాటం చేసి పొట్టి శ్రీరాములు సాధించిన ఒక గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. కానీ 2014, జూన్ 2న అతని కలల రాష్ట్రం రెండు ముక్కలుగా చీలిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా అయిదేళ్లు దాటింది. విభజనానంతరం రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకోవడాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. 2014 జూన్ 2న ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే రాష్ట్రా విభజనకు ముందు మనం ప్రతీ సంవత్సరం నవంబరు 1న ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకునేవాళ్ళం. కానీ! విడిపోయిన తర్వాత ఏర్పడిన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇది కాబట్టి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుపుకోలేమని.. ఇక జూన్ 2న జరిగిన తెలంగాణ ఏర్పాటును ఏపీ ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి ఆ తేదీన మిగిలిపోయిన అవశేష ఆంధ్రరాష్ట్ర అవతరణను జరుపుకోవడం కరెక్ట్ కాదంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడమే మానేసింది.

కానీ! సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పటికీ ఏపీ కొత్త రాష్ట్రం అయితే కాదు కదా., కాబట్టి సమైక్యాంధ్ర ఏర్పడిన రోజునే ఇప్పటి ఆంధ్ర అవతరణగా జరుపుకోవాలని అధికారులు సూచించడంతో జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర విభజన జరిగిన తేదీన కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తేదీన అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఏర్పాట్ల గురించి చర్చించేందుకు గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నెల 21న ప్రముఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

దీంతో నవంబరు 1న ఎప్పటిలా రాష్ట్ర అవతరణను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారి అమరావతిలో రాష్ట్రావతరణ వేడుకలు జరగబోతున్నాయి. కాగా గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో కాస్త అయోమయంలో పడి ఏకంగా అవతరణ దినోత్సవాన్నే నిలిపివేశారు. దానికి బదులు జూన్ 2 నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షల పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: