ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాల రాస్తున్నారని టిడిపి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన వైసిపి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు. గతంలో తమ ప్రభుత్వ పాలనలో ఎంతో మంది తమ తాబెదార్లకు రాష్ట్ర ఖజానాను దోచి పెట్టారని విమర్శించారు.టిడిపి నేతలు రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారని... జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు. తమ అనుకూల మీడియా తో రాజకీయ పార్టీలను సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు టీడీపీ సర్వ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.
చంద్రబాబు గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. అయితే చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను గమనించిన రాష్ట్ర ప్రజలు ... చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పి జగన్ ను బంపర్ మెజారిటీతో గెలిపించారని చెప్పారు krishna DAS' target='_blank' title='ధర్మాన కృష్ణ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధర్మాన కృష్ణ దాస్ . అవినీతి రహిత పాలన అందిస్తున్న జగన్ పాలనను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు దిగుతున్నదని ఆయన అన్నారు, పత్రికా స్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని... ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
గతంలో టిడిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పౌరులందరూ... తమకు అవినీతి రహితంగా పాలించే సీఎం వస్తాడా అని ఆశతో ఎదురు చూశారని... అప్పుడే ఒక ఆశాకిరణంగా పౌరులందరికీ జగన్ కనిపించాడని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత నాలుగూ నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఇప్పటికే సీఎం జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ఆయన అన్నారు. కానీ టీడీపీ మాత్రం తమ అనుకూల మీడియా ని అడ్డంపెట్టుకుని జగన్ ప్రభుత్వం పై అనవసర విమర్శలకు దిగుతుంది అని అన్నారు. ప్రస్తుతం జగన్ హయాంలో రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక పాలన సాగుతోందని ఆయన తెలిపారు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ .