కంగనా రనౌత్ గురించి అందరికి తెలుసు.  ఆమె సినిమాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు.  క్వీన్ సినిమా తరువాత ఆమె చేసిన పలు సినిమాలు విజయవంతం అయ్యాయి.  బాలీవుడ్లో ఆమె ఫైర్ బ్రాండ్.  అందుకే కంగనా అంటే చాలామంది భయపడుతుంటారు.  ఆమెతో సినిమాలు చేయడానికి చాలామందికి అయిష్టత ఉన్నా... ఆమె మార్కెట్ దృష్ట్యా సినిమా చేయాల్సి వస్తుంది.  అయితే, ఆమె నటనకు మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు.  అందులో సమస్య లేదు.  


ఆమె నటన పరంగా ఆమె చేసే మాయాజాలం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.  అభినందించే విధంగా చేస్తుంది.  అందుకే ఆమెతో సినిమా చేయడం అంటే అంతగా ఆసక్తి  చూపిస్తుంటారు దర్శక నిర్మాతలు.  సినిమా పరంగా ఆమె ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో.. అందరికి తెలిసిందే.  పేరుతో పాటు ఆమె చుట్టూ ఎప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి.  బాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్న కంగనా.. హృతిక్ లు ఇప్పుడు శతృవులయ్యారు.  


హృతిక్ పై ఆమె చేసే కామెంట్లు సెటైర్లు అన్ని ఇన్ని కాదు.  ఒక్క హృతిక్ మీదనే కాదు.ప్రతి ఒక్కరి మీద ఆమె కామెంట్స్ చేస్తుంది.  మణికర్ణికా సినిమా సమయంలో ఆ టీం మొత్తని కంగనానే లీడ్ చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఆమె లీడింగ్ ఎలా ఉంటుంది.  అంతేకాదు, ఇటీవలే వచ్చింది జడ్జిమెంటల్ హై క్యా సినిమా కూడా ఆమెనే లీడ్ చేసింది. ప్రస్తుతం ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు తమిళంలో తలైవి సినిమా చేస్తున్నది.  జయలలిత బయోపిక్ ఇది.  


ఇకపోతే, ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందని వార్తలు వస్తున్నాయి.  తనకు ఎప్పటినుంచో బీజేపీ అంటే చాలా ఇష్టం.  ప్రధాని మోడీని బాగా ఫాలో అవుతుంది.  మోడీ సమావేశాలను ఆమె తప్పకుండా చూస్తుంది.  స్వచ్ఛభారత్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, నిన్నటి రోజున మోడీ నిర్వహించిన బాలీవుడ్ నటీనటుల కార్యక్రమంలో కూడా కంగనా పాల్గొంది.  ఇలా అందరిని పిలిచి విషయాలను వివరించి చెప్పిన ఏకైక పీఎం మోడీ మాత్రమే అని, అందుకే మోడీని ప్రతి ఒక్కరు అభిమానిస్తారని అంటోంది.  ఇక రాజకీయాల్లో చేరే విషయం త్వరలోనే ఆలోచిస్తా అంటోంది కంగనా.  


మరింత సమాచారం తెలుసుకోండి: