కురుక్షేత్ర సంగ్రామం జరగ కుండా ఉండాలంటే ఐదూళ్ళిచ్చినా చాలు అన్నారు పాండవులు. అయితే రారాజు అంగీకరించక పోవటానికి కారణం, వారికి సూది మొన మోపినంత స్థలమిస్తే,  అది ఇంతింతై వటుడింతై లాగా భూనభోంతరాళను దాటేంత చేయగలరు పాండవులని రాజకీయకోవిదుడు రారాజు సుయోధనునికి తెలుసు.వైరికి అవకాశమే ఇవ్వకూడదు. ఇస్తే అది ఆకాశమంత అవుతుంది. చివికి చాటంతై తుదకు విశ్వాన్నే ఆక్రమించ గలదు. రాజకీయం తెలిసిన బీజేపి వాళ్లకు ఇది కంఠోపాటం వెన్నతో పెట్టిన విద్య.

Image result for Serilingampally to Kukatpally recent BJP rally

అలాంటి వేళ అవకాశాన్ని బంగారు పళ్లెంలో పెట్టి, మరీ కేసీఆర్ బిజేపికి    ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో అందించారు. సమ్మె నేపథ్యంలో తెలంగాణలో త్వరితగతిన చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఉదాహరణను ఋజువుచేస్తున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో చీమతల పట్టేంత చోటు ఇస్తే, అదే చివరకు అది కేసీఆర్ గారి టీఆరెస్  కొంపకే ఎసరు పెట్టెలా తయారయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 


సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గెలుచుకున్న పార్లమెంట్ స్థానాలతో ఆ పార్టీలో పెరిగిన ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం అనంతం. తెలంగాణలో తిరుగు లేదనుకునే ‘బంగారు కుటుంబం ఆడపడుచు కవిత’ ను ఎన్నికల్లో ఓడించటం సాధారణ విషయం మాత్రం కాదు. ఆమెకు ధిమ్మ దిరిగి బొమ్మ కనిపించి తలబొప్పి కట్టింది. ఆ దెబ్బకు కనీసం ఈ సంవత్సరం బతకమ్మ పండగల్లో కూడా జనం ముందుకు కవిత రాలేనంత పరిస్థితి తలెత్తింది. 

Image result for Serilingampally to Kukatpally recent BJP rally

అవకాశవాదంలో,  పార్టీలు మారటంలో, నైతికవిలువలు వదిలెయ్యటంలో తలపండిన రాజకీయ దిగ్గజం -  తనకు తిరుగులేదని, తాను ప్రణాళిక రచిస్తే నూరు శాతం జరిగిపోతుందన్న అధిక  ఆత్మవిశ్వాసం ఉండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనీసం తన కుమారుడ్ని గెలిపించుకోలేకపోయారు. అయితే ఇంతటి అధికారపక్ష ధిగ్గజాలను ధారుణంగా ఓడించి పరాభవంతో తలెత్తుకోలేకుండా చేసిన కాషాయదళానికి తెలంగాణా రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది.


భవిష్యత్తులో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయటానికి తమకు అవకాశం ఉందనే, రెట్టించిన ఆశావాదంతో ముందుకు సాగుతున్న కమలదళానికి - అప్పటి నుంచి సరైన అవకాశం కోసం మాటేసి ఎదురు చూసే వేళ  "ఆర్టీసీ కార్మికుల సమ్మె" లాంటి బలమైన ఆయుధం చేజిక్కింది. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా, ఆసరాగా ఉంటామని మద్దతిచ్చి వారు చేస్తున్న సమ్మెను ఒక ఉద్యమ స్థాయికి చేర్చటంలో బీజేపి పాత్ర చాలా ప్రశంసించ తగిందే! ఇప్పుడూ ఆ సమ్మె ఏకంగా పదిహేను రోజులు దాటింది, తెలంగాణా బంద్ దిగ్విజయం చేసుకుంది.


అయితే ఇక్కడే కేసీఆర్ సమ్మె విషయంలో వెనక్కి తగ్గకూడదన్న పట్టుదలతో ఉన్న ఆర్టీసీ కార్మికులతో - తను భేటీ అయివుంటే కథ మరోలా ఉండేది. కాని  ఈ సమ్మెలో పాల్గొనే కార్మికులు ఎంతవరకూ వెళతారో? చూద్దామన్న తెగింపు, మొండితనంలో ప్రభుత్వాధినేత కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడది కేసీఆర్ కొంప ముంచిందనే చెప్పాలి.


ఇలా ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ కార్మికులు ఇద్దరు తమ పట్టు, బెట్టును ప్రదర్శిస్తున్న వేళ, మొన్న శుక్రవారం "శేరిలింగంపల్లి నుంచి కుకటపల్లి" వరకూ బీజేపీ నిర్వహించిన "మోటార్ బైక్ ర్యాలీ తన జోరు" ను చూపించింది. అది చూసిన గులాబీ నేతలకు నోటమాట రాని పరిస్థితి. హైదరాబాద్ నగరంలోనే కాదు సరిహద్దుల్లొ కూడా బీజేపీకి ఎంత పట్టుందో ఇప్పుడు నగర వాసులకు తేటతెల్లమైంది. "భారీ ఎత్తున సాగిన ఆ రాలీ చూసే అదొక విజయోత్సవమో? కౌముదీ మహోత్సవమో? అన్నంతగా ఆశ్చర్యచకితులను చేసింది. కనుచూపు మేరకు భారీ ఎత్తున బైకులతో ర్యాలీకి వచ్చిన వారితో బీజేపీ నేతలకు నూతన ఉత్సాహాన్ని పెంచింది. హైదరాబాద్ ఆ తరవాత తెలంగాణాని అజేయంగా స్వంతం చేసుకుందామను కుంటున్న బీజేపి, ఈ టిఎస్-ఆర్టీసీ కార్మికుల రాలీని ఆలంబన చేసుకుని భాగ్యనగరాన్ని కాషాయవర్ణంతో కప్పేసింది.  


బీజేపీ నిర్వహించే ర్యాలీకి ఇంత భారీ స్పందన ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. ర్యాలీలో బీజేపీ కార్యకర్తలతో పాటు, ఆర్టీసీ కార్మికులు వందల సంఖ్యలో ఉండటంతో వాతావరణం ఒక్కసారి మారిపోయింది. "ఆర్టీసీ సమ్మె, తెలంగాణా బంద్" సంగతేమో కానీ, రాజకీయ సమీకరణాల్లో నూతన  మార్పులు వస్తున్నాయన్నది కూకటపల్లిలో బహిర్గతమైంది. అంతేకాదు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ తో ఉప్పొంగిన ఉత్తేజం కూకటపల్లి వాసులను నిన్న స్వయంగా తెలంగాణా బంద్ పాటించి, సకలజనుల సమ్మెను తలపించేలా  చేసిందనే చెప్పాలి. బహుశా, టీఆరెస్-కేసీఆర్ లకు రాజకీయ అంతిమ ఘడియలు అతిసమీపంలోనే పొంచి ఉన్నాయనేది విశ్లేషకుల భావన.  

మరింత సమాచారం తెలుసుకోండి: