తెలంగాణలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు భారీగా కురిశాయి. గత 24 గంటల్లో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురవగా అదే జిల్లా నర్సంపేటలో కూడా ఏకంగా 15 సెం.మీ. అతి భారీ వర్షం నమోదైంది. అలాగే మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 12 సెం.మీ., వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లిలో 11 సెం.మీ. చొప్పున భారీ వర్షం నమోదు అయింది. 


రాష్ట్రంలో ఇంకా చూస్తే మద్నూరులో 10 సెం.మీ., ఖానాపూర్, మాచిరెడ్డి, డిచ్‌ పల్లిలో 9 సెం.మీ., ఘన్‌పూర్, జుక్కల్, హన్మకొండలలో 8 సెం.మీ., చొప్పున వర్షపాతం భారీగా నమోదైంది. ఈ సీజన్‌ ప్రారంభమైన ఈ నెల 1 వ తేదీ నుంచి శనివారం వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 66.4 మిల్లీ మీటర్లు కాగా, 89.4 మిల్లీమీటర్లు నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.


వీరి లెక్కల ప్రకారం 35% అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఇది ఇలా వుండగా తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి. దీనితో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు రోజులు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.


కానీ ఈ వర్షాలతో మాత్రం మాత్రం రైతులలో పూర్తిగా ఆనందం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరంలో వర్షరూ సంవృద్ధిగా పడడంతో ప్రతి చెరువు, కుంట, అనకట్టలలో నీరు పుష్కలంగా ఉంది. దీనితో ప్రజలు, పాలకులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: