ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైస్సార్సీపీ కొత్తగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం ముప్ఫై మందితో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను రిలీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. 


సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు చెందిన నేతలను అధికార ప్రతినిధులుగా అవకాశం ఇచ్చారు. రెడ్డి, కాపు, కమ్మ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అవకాశం కలిపించారు. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ఆయా అధికార ప్రతినిధులు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించ బోనున్నారు. టీవీ ఛానళ్లలో జరిగే డిస్కషన్లకు కూడా వారే హాజరవుతారు అని అయన తెలిపారు.


ఈ 30 ముంది పేరు ఈ విధంగా ఉన్నాయి. 1) శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి 2) శ్రీ మేరుగు నాగార్జున 3) శ్రీ తెల్లం బాలరాజు 4) శ్రీ రాజన్న దొర 5) శ్రీమతి విడదల రజని 6) శ్రీ ధర్మాన ప్రసాదరావు 7) శ్రీ కె. పార్థసారధి 8) శ్రీ జోగి రమేష్ 9) శ్రీ సిదిరి అప్పలరాజు 10) శ్రీ అదీప్ రాజ్ 11) శ్రీ మహ్మద్ ఇక్బాల్ 12) శ్రీ అంబటి రాంబాబు 13) శ్రీ గుడివాడ అమర్నాథ్ 14) శ్రీ కిలారు రోశయ్య 15) శ్రీ జక్కంపూడి రాజా 16) శ్రీ అబ్బయ్య చౌదరి 17) శ్రీ మల్లాది విష్ణు 18) శ్రీ కాకాని గోవర్ధన రెడ్డి 19) శ్రీ జి. శ్రీకాంత్ రెడ్డి 20) శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి 21) శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి 22) శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి 23) శ్రీమతి నారమల్లి పద్మజ 24) శ్రీ కాకుమాను రాజశేఖర్ 25) శ్రీ అంకంరెడ్డి నారాయణ మూర్తి 26) శ్రీ నాగార్జున యాదవ్ 27) శ్రీ రాజీవ్ గాంధీ 28) శ్రీ కె. రవిచంద్రారెడ్డి 29) శ్రీ ఈదా రాజశేఖర్ రెడ్డి 30) శ్రీ పి. శివ శంకర్ రెడ్డి


ఈ ముప్ఫై మంది సభ్యులు వివిధ వర్గాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: