తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నిజంగానే రెడ్డిగారి గోల మామూలుగా లేదనే చెప్పాలి.టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కూడా రెడ్డి వర్గానికే చెందిన నేత బాధ్యతనంతా భుజాన వేసుకున్నారు.ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి...కాంగ్రెస్ లోని ముగ్గురు రెడ్లపై ఓ రేంజిలో ధ్వజమెత్తారు. 

 

ప్రస్తుతం అక్కడ పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యేనని కూడా చెప్పాలి.ఈ క్రమంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ చెప్పుకొచ్చిన పల్లా... ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో తలెత్తే పరిస్థితిపై తనదైన శైలి విశ్లేషణ వినిపించారు.కాంగ్రెస్ గెలుపు కోసం ఒక్కటి అయిన ముగ్గురు రెడ్లలో ఇద్దరు రెడ్లు రోడ్డెక్కి మరీ కొట్టుకుంటారంటూ పల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయాయి.మరియు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి హుజూర్నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా అవమానించేలా మాట్లాడారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

టీఆర్ఎస్ తరఫున పల్లా రంగంలోకి దిగితే.. కాంగ్రెస్ గెలుపు కోసం నిన్నటిదాకా ఎడముఖం పెడముఖంగా ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిలు ఏకమైన సంగతి తెలిసిందే.ఇక హూజూర్ నగర్ బైపోల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సైదిరెడ్డి కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు.ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు.టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు హుజూర్నగర్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అన్నారు.

 

ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని సైదిరెడ్డి ఓ రేంజిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఎం జరిగిదో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: