ఐదేళ్ల పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగి... దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాందీ పలికిన మన్మోహన్... పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా వ్యవహరించారు.ప్రధానిగా ఉన్న సమయంలో బయటకు కనిపించినా... పెద్దగా నోరిప్పిన సందర్భాలే లేవని చెప్పాలి. 

 

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి... వరుసగా మరోమారు కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మౌనముని తన మౌనాన్ని వీడారనే చెప్పాలి.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు వినగానే... మౌనమునే గుర్తుకు వస్తారు.ప్రధాని నరేంద్ర మోదీ అండ్ కోపై ఓ రేంజిలో ధ్వజమెత్తేందుకే తన మౌనాన్ని మన్మోహన్ వీడితే... మన్మోహన్ సంధించిన ప్రశ్నలకు అసలు మోదీ వైపు నుంచి ఆన్సరే వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలు మన్మోహన్ ను ఆగ్రహానికి గురి చేశాయని చెప్పాలి. ఎందుంకటే... ప్రధానిగా ఉన్న సమయంలో రబ్బర్ స్టాంప్ గానే వ్యవహరించినా... మన్మోహన్ ఆర్థిక వ్యవహారాల్లో ప్రపంచంలోనే చేయి తిరిగిన ఆర్థిక వేత్తే కదా.కానీ సీతారామన్ మన్మోహన్ రఘురామ రాజన్ ల హయాంలోనే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.అందుకే దేశ ఆర్థిక వ్యవస్థపై నిర్మల చేసిన వ్యాఖ్యలతో మన్మోహన్ భగ్గుమన్నారు.

 

 ‘‘యూపీఏ హయాంలో తప్పులు జరిగాయని చెబుతున్నారు కదా. సరే తప్పులే జరిగి ఉంటే... వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మోదీకి లేదా? తప్పులు జరిగాయని చెబుతున్న మోదీ... ఆ తప్పులను సరిచేస్తే... వ్యవస్థ చక్కబడుతుంది కదా. ఆ పని మానేసి దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పాపమంతా వైరి వర్గాల మీదకు నెట్టేస్తే సరిపోతుందా? అంటూ నిర్మల వ్యాఖ్యలపై స్పందించేందుకు రంగంలోకి దిగేసిన మన్మోహన్... నిర్మలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ పై సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న కామెంట్లు చేశారు.

 

ఆ పని చేయడం మానేసి గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా చవకబారు ఆరోపణలు మాని పాలనపై దృష్టి సారించాలి’’ ఇలా మన్మోహన్ ఓ రేంజిలో ఫైరైపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: