జగన్ మోహన్ రెడ్డికి ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శన భాగ్యం కల్పించారు.ఈ భేటీలో అమిత్ షా తో ఏపీ సీఎం జగన్  గత ప్రభుత్వం చేసిన భారీ తప్పిదాలను వివరించి చెప్పనున్నారు.ఈ మేరకు అమిత్ షా కార్యాలయం నుంచి సీఎంవోకు సమాచారం అందింది. ఈ భేటీపై అటు బీజేపీలో ఇటు టీడీపీలో రాజకీయ చర్చకు తెరతీసింది.

 

కానీ మహారాష్ట్ర ఎన్నికల కారణంగా అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో భేటీ వాయిదా పడింది. ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రితో భేటి కాకుండా రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు.అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అక్రమాలను అమిత్ షా దృష్టికి  తీసుకెళ్లాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.

 

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించడంతో పాటు విభజన చట్టంలోని హామీల అమలుకు అమిత్ షాను జగన్ కోరనున్నారు.అమిత్ షా జగన్కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ ఇప్పుడు ప్రదానంగా టీడీపీ వర్గాల్లో ఎక్కడ లేని ఆందోళన నెలకొంది.

 

ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డికి ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శన భాగ్యం కల్పించారు. ఈనెల 21న అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని వైసిపి వర్గాల సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: