ఇంకా ఎన్నాళ్లు ఈ దారుణ సంఘటనలు, ఆడవాళ్లపై జరిగే ఘోరాలు. ఇక ఈ అఘాయిత్యాలకు అంతే లేదా ?. పసివాళ్లని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించే మానవ తోడేళ్లను అణిచివేసే రోజు ఇక రాదా అని ఆడపిల్లలను కన్న ప్రతి తండ్రి ఆవేదన ఇది. అభం శుభం తెలియని పసివాళ్లను చూస్తే కరిగిపోవలసిన హృదయాలు ఎందుకు కఠినంగా మారుతున్నాయి ? ఇదేనా మన సంసృతి, ఇలాంటి చర్యలను ఆపాలంటే కఠినమైన చట్టాన్ని తేవలసిన అవసరం వుందనిపిస్తుంది. లేకుంటే భవిష్యత్తులో ఆడపిల్లలను కనాలంటే ఆలోచించవలసిన అవసరం వస్తుంది.


ఇంతకు ఏమైందంటే ఆరేళ్ల బాలికపై యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన పల్నాడులో కలకలం రేపింది. గుంటూరు జిల్లా దాచేపల్లి దాచేపల్లి మండలం పెదగార్లపాడుకి చెందిన నరేంద్ర రెడ్డి(18) అనే యువకుడు ఆరేళ్ల బాలికపై కన్నేశాడట. ఎవరూ లేని సమయం చూసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడట. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించడంతో నరేంద్ర రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడట. ఇక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఇకపోతే నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేసి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బాలికపై అత్యాచారం ఘటనతో పెదగార్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..అదీగాక తాజా ఘటన ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట.


ఇలాంటి ఘటనలు చూస్తుంటే నేటి సమాజ పయణం ఎటువైపు...! మంచివైపా...చెడువైపా. అనే ప్రశ్నకు సరైన అర్ధం దొరకదనిపిస్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం తప్పుచేసిన వాడిని చూసి మరొకడు ఇలాంటి తప్పు చేయాలంటే వణికిపోయేలా చట్టం శిక్షలు వేస్తే గాని మార్పు అనేది సంభవించదు. అని అనుకుంటున్నారట లోకంలోని మహిళలు.... 


మరింత సమాచారం తెలుసుకోండి: