జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లన్స్ తీసుకొచ్చి అందరి సంతోష పెడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. 

         

ఈ నేపథ్యంలోనే తాజాగా జియో మరో సంచలన ప్రకటన చేసింది. జియో 'ఆల్ ఇన్ వన్ ప్లాన్‌'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్లాన్ తో అపరిమిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డాటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జియో పేర్కొంది. 

            

ప్రత్యర్థి టెలికం కంపెనీల కంటే అతి తక్కువ ధరకు తాము ఉత్తమ సేవలను అందిస్తున్నట్లు జియో చెబుతుంది. మాములు ప్లాన్ కంటే అదనంగా చెల్లించే రూ.111 ప్లాన్‌తో మరో నెల పాటు అపరిమిత సేవలు పొందవచ్చని జియో ప్రకటించింది. కాగా ప్రత్యర్థి కంపినీలు 249 రూపాయలకు ఇచ్చే సౌకర్యాల కంటే జియో 222 రూపాయిలకే ఇస్తుంది. 

             

రెండు నెలల ప్లాన్‌ను ఇతరులు రూ. 500లకు ఇస్తుంటే జియో రూ.333లకే అందిస్తోంది. కాగా ప్రస్తుత జియో 3నెలల ప్లాన్ ను రూ. 448గా ఉంటే దాన్ని రూ. 444గా మార్చారు కాగా రెండు నెలల ప్లాన్ లో రూ.396 బదులుగా రూ.333 మాత్రమే చెల్లించే విదంగా ఈ ప్లాన్ లో వెయ్యి నిమిషాల వాయిస్ కాల్స్ పొందే అవకాశాన్ని జియో అందిస్తుంది. 

       

మరింత సమాచారం తెలుసుకోండి: