తెలుగు రాష్ట్రానికి సంచలన విజయంతో సీ.ఎం అయిన జగన్మోహన్ రెడ్డి పై మొదటి నుండి మాటల బాణాలు సందిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఇంకా ఫైర్ అయి పోతున్నారు.తమ ప్రభుత్వం లో ఇసుక ఫ్రీగా ఇస్తాము అంటే పిచ్చోళ్ళగా చేసారని.

కానీ ఇప్పుడు అసలు ఇసుక లేని రాష్ట్రంగా మార్చారని బంగారం అయినా కొనడానికి షాపులు ఉన్నాయి కానీ ఇసుకను కొనడానికి ఆస్తులు అమ్ముకున్న కూడా దొరకని దుస్థితికి తీసుకువచ్చారని వారు పేర్కొన్నారు.భస్మాసురుడిని చూసాం కానీ ఈయన ఇసుకాసురుడు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్రం గా మండి పడ్డారు.ఈ వంద రోజుల పాలనలో పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ ని తొలగించారు.దోమల పై యుద్ధం చేసాం అని ఎద్దేవా చేసారు.

24 గంటలు ఉండాల్సిన కరంట్ ని కాస్త అసలు  లేకుండా చేస్తున్నారు.ఇలా ఒక్కటేమిటి ఇలా ఎన్నో ఇబ్బందులు జనం పడుతున్నారు.పనికి రాని పెన్షన్ పద్ధతులు పెట్టి పనికి రాని పథకాలను పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఆఫీస్లకు పార్టీ రంగు పులుము కుంటు ఇష్టా రాజ్యంగా చేస్తున్నారని.ఆఫీసు ల బిల్డింగ్ కి రంగులు వేసే బదులు మీ పార్టీ నాయకుల ముఖానికి పూసుకోండి అని మండి పడ్డారు.ఇలా రాష్ట్రం అంత కూడా అట్టుడికి పోతుంది.ఎందుకు గెలిపించుకున్నాం రా దేవుడా అని ప్రతి రోజు నరకం చూస్తున్నారు.పుచ్చు పోయిన పన్నైనా నొప్పి కాసేపు ఉండి సమసి పోతుంది కానీ పుచ్చి పోయిన రాజకీయ విధి విధానాలు మాత్రం మొత్తం రాష్ట్రానికే ముమ్ము అని చాలా ఘోరంగా తిట్టిపోశారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు.చూద్దాం ఇంకా ఇలాంటి పాలన చూస్తుంటే ఎన్నెన్ని వైపరిత్యాలు అనుభవించాల్సి వస్తుందో ఏంటో అని అటు నెటిజన్లు,ఇటు విమర్శకులు కూడా వారి వారి మాటలకు పదును పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: