ఆంధ్ర ప్రదేశ్ లోగ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు కూడా సమ్మె బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కార మార్గం చూపకపోవడంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలియచేయడం జరిగింది. వీళ్ళు పంచాయతిరాజ్ కమిషనర్ గిరిజాశంకర్కు సమ్మెనోటీసు కూడా అందచేసాము అని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్మికులను గ్రీన్ అంబాసిడర్లను గ్రామ సచివాలయ ఉద్యోగులుగా గ్రహించాలని ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక ఏకంగా కార్మికుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు అని పేర్కొన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలి అని డిమాండ్లు చేస్తున్నారు. ఈ సౌకర్యాలు అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
ఇప్పటి వరుకు పంచాయతీ కార్మికులకు 1999లోనే జీఓ 551 ద్వారా గుర్తింపుకార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఇచ్చిన ఆదేశాలు అసలు అమలు అవ్వలేదు అని తెలియచేయడం జరిగింది. ఐతే పార్ట్ టైం వర్కర్లుకు టైంస్కేల్ అమలు చేయాలని ఇచ్చిన జీఓ ఇంతవరుకు అమలుకు నోచుకోలేదు అని తెలిపారు. ఎప్పటి నుంచి ఉద్యోగాల్లో ఉన్న వారిని కొనసాగించాలని 2015లో హైకోర్టులో తీర్పు వచ్చినప్పటికి కూడా.. కృష్ణా, నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల పంచాయతీ అధికారులు ఇప్పటికి కూడా అమలు చేయడం లేదు అని తెలియచేయడం జరిగింది.
ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో తొలి మంత్రివర్గ సమావేశంలోనే పారిశుధ్య కార్మికులకు రూ.18 వేల వేతనం ఇస్తామని తెలియచేసిన కూడా ఇప్పటి వరుకు అసలు పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు చేశారు. ఈ కారణం వల్ల పారిశుధ్య కార్మికులు మనస్థాపానికి గురి అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28, 29, 30 మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.