వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను ఏకిపారేయడంతో దిట్ట. నిత్యం సోషల్ మీడియాలోనే కాలం గడుపుతూ ప్రతిపక్ష నాయకుల వ్యవహారశైలీపై దుమ్మెత్తి పోయడం, సెటైర్లు వేయడంలో మేటి. తన రాజకీయ చతురతను సోషల్ మీడియాలో చూపుతూ ప్రతిపక్షాల నోరు నొక్కడంలో ముందుంటారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ట్విట్ పై దుమారం రేగుతుంది. విజయసాయి రెడ్డి చేసిన ట్విట్లకు టీడీపీ నేత బుద్దావెంకన్నరీ ట్వీట్ చేయడం నిత్యకృత్యమే. ఇద్దరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటారు.
ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్కు టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇచ్చిన కౌంటర్తో మరోమారు సోషల్ మీడియా వేధికగా ఇద్దరి నడుమ ట్వీట్ వార్ రంజుగా సాగుతుంది. ఇంతకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు టీడీపీ నేత బుద్దా వెంకన్న అంతలా రియాక్ట్ కావాల్సినంత అవసరం ఏమోచ్చింది అనుకుంటున్నారా.. తన పార్టీ నేతను మరో పార్టీ నేత విమర్శిస్తే ఊరుకుంటారా మరి.. అదే చేసారు బుద్దా వెంకన్న. విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై చేసిన విమర్శలకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు..
ఢిల్లీలో కూర్చుని కాళ్ళు పట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ జగన్కి విశ్వసనీయత అర్ధం తెలుసనుకోవడంలేదు శకుని మామా విజయసాయిరెడ్డి! మీ తప్పుల్ని చంద్రబాబుగారు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న. మరో ట్వీట్లో బుద్దా వెంకన్న ఇలా రాసారు.. దాదాపు 70 లక్షలమంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది శకుని మామా.
తెదేపా హయాంలో చంద్రబాబుగారు ప్రజలకు ఉచితంగా ఇసుకని ఇచ్చారు. కార్మికుల కడుపు నింపారు. మీ
జగన్ మాత్రం ఉన్న ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేసాడు. పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా ! అని విజయసాయి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డిని శకుని మామగా అభివర్ణించడం విశేషం.