తన భర్త భార్గవ్తోపాటు కుటుంబానికి ఏ మాత్రం హాని జరిగినా కర్నూలు ఎస్పీ ఫకీరప్పదే బాధ్యతన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఎస్పీ ఫకీరప్పపై గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలపెట్టబోనని హెచ్చరించారు అఖిలప్రియ.
తన భర్త భార్గవ్పై ఇటీవల ఏపీ, తెలంగాణాల్లో నమోదైన వరుస కేసులపై మాజీ మంత్రి అఖిలప్రియ స్పందించారు. ముఖ్యంగా కర్నూలు ఎస్పీ ఫకీరప్పను టార్గెట్ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చేస్తున్న అరాచకాన్ని హీరోయిజం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. గతంలో భూమా నాగిరెడ్డిపై ఎలా తప్పుడు కేసులు పెట్టారో.. ఇప్పుడు తన భర్త భార్గవ్పైనా అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు అఖిలప్రియ.
తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలపెట్టబోనని హెచ్చరించారు మాజీ మంత్రి. వారెంట్ లేకుండా ఇళ్లలో సెర్చ్ చేయడం హీరోయిజం కాదన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా భయపడబోనన్నారు. అలాగే యురేనియం తవ్వకాలపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. బెయిల్ వచ్చినా తమను ఇబ్బది పెట్టడం మంచిది కాదన్నారు అఖిలప్రియ.