టీడీపీ అధినేత చంద్రబాబుకు కమ్మ కులం సంక్షేమమే తప్ప.. దళితులు, బీసీల గురించి పట్టదని వైసీపీ ఆరోపించింది. దళిత వర్గానికి చెందిన మురళికృష్ణను కులం పేరుతో దూషించిన ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వీసీ దామోదర్‌నాయుడును కాపాడేందుకు టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏకంగా గవర్నర్ ను కలవడంపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు.


టీడీపీ ఎజెండా ఒక్కటేనని, తమ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను కాపాడుకోవడమే అన్నారు. మిగతా కులాల వారు ఏమైనా టీడీపీకి ఫర్వాలేదని, పచ్చ చొక్కాల పరిరక్షణే వారి ధ్యేయమన్నారు. దామోదర్‌ నాయుడికి, టీడీపీకి, కేశినేని నానికి కులం ఒక్కటే సంబంధం అన్నారు. మా దళితులు, బీసీలు మీకు ఓటు వేయలేదా అని నిలదీశారు. రేపు మా గడపలకు వచ్చి ఓటు ఎలా అడుగుతారని ఫైర్‌ అయ్యారు.


మీ పరిపాలనలో నాగార్జున యూనివర్సిటీలో బీసీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు అక్కడి ప్రిన్సిపాల్‌ కారణమైతే ఆయన్ను వెనుకవేసుకొచ్చారని తెలిపారు. అణగారిన కులాల మనుగడ మీకు పట్టదా? అని ధ్వజమెత్తారు.కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడుకునేందుకు అడ్డంగా గడ్డి తినడానికి కూడా టీడీపీ నేతలు వెనుకాడరన్నారు. మా నాయకుడు రాజ్యాంగం మీద నమ్మకంతో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే..అభినందించాల్సింది పోయి..విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తీరు బాధాకరమన్నారు. ప్రజలన్ని కూడా గమనిస్తున్నారని, టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు సరికాదని తప్పుపట్టారు. ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు తెచ్చి భవితరాలకు వైయస్‌ జగన్‌ బంగారు బాటలు వేస్తుంటే.. మా పాలనలో నేరాలు , ఘోరాలు జరిగిపోతున్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన బృందం గవర్నర్‌ను కలిశారని తప్పుపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: