అయితే ఎవరైనా ఫుల్లుగా తాగితే ఏం చేస్తారు... సైలెంట్ గా ఇంటికి వెళ్లి పడుకోవడమో లేకపోతే రోడ్డు మీదే  పడుకోవడమో  చేస్తారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తప్పతాగి రైలు పట్టాల మీద పడుకున్నాడు.మామూలుగా అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలంటే రైలు కిందపడడానికి వెళ్తారు. అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు రైలు పట్టాలపై పడుకుంటే వాళ్ల మీద నుంచి రైల్లు  వెళ్లింది అనుకోండి.... శరీరం ముక్కలు ముక్కలై పోతుంది. కానీ ఇక్కడ ఒక అతనికి మాత్రం అతని మీద నుంచి మూడు రైలు వెళ్లినప్పటికీ కూడా అతనికి చిన్న గాయం కూడా కాలేదు. మూడు రైలు అతని మీద నుంచి వెళ్ళినప్పటికి కూడా మృత్యుంజయుడై బయట పడడం చూసి అధికారులు షాక్ తిన్నారు. అయితే ఫుల్ గా తాగి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి మూడు రైలు వెళ్ళిన తర్వాత  ఒక నిద్రలోంచి   లేచినట్టు లేచి వెళ్ళిపోయాడు . 

 

 

 

 మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మేంద్ర అనే  వ్యక్తి గట్టిగా మందు కొట్టాడు. ఇక తప్ప తాగిన ఆ వ్యక్తి ఒళ్లు తెలియకుండా నడుస్తూ వెళ్ళి... రైలు పట్టాలపై స్పృహ లేకుండా పడిపోయాడు. అయితే పట్టాలపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన రైలు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరారు. కానీ  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఆ దారి  గుండా మూడు రైళ్లు  వెళ్లాయి.

 

 

 

 దీంతో ధర్మేంద్ర చనిపోయారని పోలీసులు అనుకున్నారు... కానీ పోలీసులు దగ్గరికి వెళ్లి చేసే సరికి  మూడు రైలు వెళ్ళిన తర్వాత మద్యం మత్తు వదిలిన  ధర్మేంద్ర  నిద్రనుంచి లేచినట్లు లేచాడు. అయితే అక్కడికి వచ్చిన పోలీసులు ధర్మేంద్ర ను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడం చూసి తాగుబోతు అయిన ధర్మేంద్ర మృత్యుంజయుడు అంటూ  మందలించి  ఇంటికి పంపారు పోలీసులు. అయితే తప్ప తాగి రైలు పట్టాలపై పడుకున్నప్పటికీ ... ఆ దారి గుండా మూడు రైళ్లు   వెళ్లి  వ్యక్తికి ఏమి కాలేదంటే నిజంగా మృత్యుంజయుడై కదా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: