ఈ సమాజంలో స్త్రీ దేహాన్ని విలాసవస్తువుగా చూసే ధోరణి నానాటికి పెరిగిపోతుంది. మనిషిలోని గుణం పశువుగా మారి చేయకూడని పనులు చేస్తూ ఇంతకింతకు దిగజారుతున్నాడు. ఇకపోతే నేరానికి తగిన శిక్షలు మన చట్టాల్లో లేవు. ఒకవేళ ఉన్నా ఆచరణలోకి రావు ఇలాంటి విషయాలను కొందరు తమకు అనువుగా మార్చుకుని సమాజంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో మనిషి నీడను కూడా నమ్మలేని రోజుల్లో బ్రతుకుతున్నాం. అందుకే మనతో ఎవరైన నమ్మకంగా ఉన్నా వారిని కూడా అనుమానించే పరిస్దితులు ఎదురవ్వుతున్నాయి.


ఇకపోతే ఇప్పుడొక వ్యక్తి నమ్మకంతో అతికౄరంగా ప్రవర్తించాడు. నీచానికి దిగజారి ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసాడు. ఇది ఎక్కడో జరిగిన ఘటన కాదు. నగరంలో మల్కాజ్‌గిరిలో జరిగిన ఘోరం ఇది. వివరాల్లోకి వెళ్లితే.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌ద్వారా తనకు డైటింగ్ ప్లాన్ కావాలని ఓ సంస్థను సంప్రదించింది. దీనికి స్పందించిన సదరు సంస్దవారు  ఈ నెల 9వ తేదీన తమ ఏజెంట్ ఇంటికి వచ్చిన వివరిస్తారని మెసేజ్ పంపింది.. అన్నట్లుగానే ట్రూవెయిట్‌ న్యూట్రీషియన్‌ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న యూసఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ షాజిద్‌ అనే అతన్ని పంపింది..


ఈ నెల 10వ తేదీన షాజిద్ ఆ యువతి ఇంటికి వెళ్లి కలిశాడు. డైట్ ప్లాన్ వివరిస్తుండగా యువతి ఇంట్లో ఒంటరిగానే ఉన్న విషయం తెలుసుకున్నాడు.. అతనిలో ఉన్న మృగం ఆసమయంలో  మేల్కొంది. దీంతో తను వచ్చిన పని మరచి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చంపేస్తానని బెదిరించి యువతిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే  యాసిడ్ పోసేస్తానని బెదిరిస్తూ అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పిన యువతి ఈ నెల 16వ తేదీన మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని షాజిద్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: