రాష్ట్రంలోని అర్చకులకు, బ్రాహ్మణులకు మునుపెన్నడూ జరగనంత మేలు ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు . చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమం కోసం అనేక వినూత్న, నూతన పథకాలను అమలు చేశారు. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా వంశపారపర్యంగా అర్చకత్వం చేసే హక్కును కలిగించాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు  జీఓ నెం.76ను విడుదల చేసే ముందు అర్చకత్వ నాయకులతో సంప్రదింపులు జరుపగా.. కొంతమంది 'రైట్‌ టూ అర్చకత్వం' జీఓ విడుదల కాకుండా నాడు అడ్డుపడిన వారే నేడు అదే జీవో విడుదల తమ ఘనతగా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఈ చర్యలను అర్చక సంఘాలన్నీ గమనిస్తూ ఉన్నాయి.

  

చంద్రబాబు గారు ఎన్నికల ముందు అర్చకులకు వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచి దానిని రూ. 20వేలు పెంచేలా ప్రకటించగా.. వైకాపా ప్రభుత్వం రూ.10వేలను రూ.16,500కు మాత్రమే పెంచి అర్చకులను నిలువునా మోసం చేసింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్చకులకు కూడా అందజేసిన ఘనత చంద్రబాబు గారిది. అర్చకుల ప్రతి ఒక్క డిమాండ్‌ను పరిష్కరిస్తూ రాష్ట్రంలోని అర్చకులందరికీ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, దేవాదాయ శాఖలోని ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ దేవాలయాలలో పనిచేసే అర్చకులకు కూడా ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయాలని ఆనాడు చంద్రబాబు గారు నిర్ణయించారు.

  

సుమారు 15వేల మంది అర్చకులకు లబ్ధి చేకూర్చే విధంగా నాడు చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తే.. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ సంఖ్యను కుదించి 3,600 మందికి మాత్రమే పథకాలు వర్తింపజేస్తూ వారికి తీరని అన్యాయం చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఆదాయాన్ని పెంచే విధంగా చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే అర్చకులు, బ్రాహ్మణులకు ఇబ్బంది లేకుండా అమరావతిలో బ్రాహ్మణ-అర్చక భవానాన్ని రెండంతస్తులలో నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించకపోవడం బాధాకరం. కావున అర్చకులందరూ నిజానిజాలు తెలుసుకుని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయన పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: