హనుమంతుడి ముందు కుప్పిగంతులేస్తున్నట్టు ఉంది పాకిస్తాన్ తీరు.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రతిక్షణం భారత్ పై విషం చిమ్మడంమే పనిగా పెట్టకుంది పాక్. ఆదేశానికి చెందిన యూనియన్ మినిష్టర్  భారత్ తో అణు యుద్దం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సింగర్ కూడా పదేపదే భారత్ పై ప్రధాని మోదీపై విమర్శలు చేస్తుంది.


గతంలో రబ్బీ పిర్జాదా పామును పట్టకుని మోదీపైకి పాముని వదులుతా అన్న విషయం తెలిసిందే.తాజాగా వివాదాస్పద గాయని రబ్బీ పిర్జాదా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఎప్పుడూ కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటుంది.  పైగా భారత్‌ను టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియా పేజీలో ఎప్పటికప్పుడు వివాదాస్పద కమెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.  ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన పోస్ట్ పెట్టింది. అసభ్య పదజాలాన్ని వాడుతూ బెదిరించే ప్రయత్నం చేసింది.

మోదీని టార్గెట్ చేస్తే తోలు తీసాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే మన వాళ్ళు ఊరుకుంటారా ? అది ఆమెకే తిప్పి కొట్టారు నెటిజన్స్. చూస్తుంటే  రబ్బీతో నెటిజన్స్ రగ్బీ ఆడుకుంటున్నారు.దేశాన్ని.. మా ప్రధానిని బెదిరించేంత దమ్ముందా నీకు అంటూ ఆమెని కామెంట్లతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు.  ఆత్మాహుతి బాంబర్ జాకెట్ ధరించి మోదీ కోసమే అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 


దీనిపై భారత్ ప్రజలే కాకా యావత్తు నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇది మీ పాకిస్తాన్ యూనిఫామా అంటూ రబ్బీకి కౌంటర్స్ వేస్తున్నారు. భారత ప్రధాని మోదీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చింది రబ్బీ నెటిజన్ల కు చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడూ భారత్‌ను బెదిరించే పిచ్చి చేష్టలతో సోషల్ మీడియాలో పిచ్చి పుల్కా అవుతూ  ఉంటుంది ఈ పాకిస్తాన్ సింగర్.  మొత్తానికి మరోసారి అలా చేయబోయి నవ్వుల పాలైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: