కాపాడాల్సిన ఓ వార్డెన్ తన భర్త అక్కడున్న అమ్మాయిల పై అత్యాచారం చేస్తే అతనికి సపోర్ట్ చేస్తూ సభ్య సమాజం తల దించుకునేలా చేసింది.ఈ ఘోర దుర్ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోజరిగింది. అమ్మాయిల హాస్టల్ సూపరింటెండెంట్ భర్త అదే హాస్టల్లో ఉంటున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు.ఈ హాస్టల్ ధనోరా గ్రామంలో ఉందని, అసలైన నిందితుడు వినోద్ నాగ్ పరారీలో ఉండటంతో అతడి భార్య, హాస్టల్ సూపరింటెండెంట్ అయిన నీతా నాగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ కార్తికేయ గోయల్ తెలిపారు.వినోద్ నాగ్ తమపై అత్యాచారం చేసినట్లు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారని, వాళ్లు ఎంత చెప్పినా సూపరింటెండెంట్ ఏమాత్రం పట్టించుకోకపోగా.. వీలైనంతవరకు కేసును తొక్కేయడానికి ఆమె ప్రయత్నించారని కలెక్టర్ తెలిపారు. దాంతో ఈ విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: