ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానించారని గతంలో రవిప్రకాశ్పై ఎల్బీనగర్ పీఎస్లో కేసు నమోదైంది. తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా టీవీ9 బుల్లెట్ న్యూస్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. టీవీ-9, ఏబీఎన్ చానల్స్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలను అవమానించారంటూ తెలంగాణ కేబుల్ అపరేటర్లు టీవీ-9, ఏబీఎన్ చానల్స్ ప్రసారాలను తెలంగాణలో నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ లోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. కేబుల్ ఆపరేటర్ల నాయకులతో మాట్లాడి సదరు చానల్స్ ప్రసారాలను పునరుద్దరించాలని సూచించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: