నగర శివారులోని ఓ అపార్ట్ మెంట్ పై పోలీసులు దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటన నగరం శివారులోని జవహర్ నగర్ యాప్రాల్ రిజిస్ట్రేషన్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ అపార్ట్ మెంట్ పై దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో ముగ్గురు యువతులు, ఆరుగురు యువకులు ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే కార్లను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. యువతీయువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన ముగ్గురు యువతులు పక్క రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: