కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలు సాగించిన వ్యవహారాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. వీళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక మందితో ఆడుకొన్నారని తెలుస్తోంది. తాజాగా అలాంటి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ జెట్ విమానయాన సంస్థలను బెదిరించిందట ఈ ఫ్యామిలీ! అలాంటి బెదిరింపులతో విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేశారట వీళ్లంతా. సోనియాగాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా, తనయుడు రాహుల్ గాంధీలు ఈ విధంగా విమానాల్లో ఉచిత ప్రయాణాలు చేసినట్టుగా తెలుస్తోంది! ఈ వ్యవహారం గురించి వార్తా కథనాలు మొదలయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ఈ విధంగా వ్యవహరించిందనేది ఆ కథనాల సారాంశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి అధికారం చేజారడంతో ఈ విషయాన్ని విమానయాన సంస్థలు బయటపెడుతున్నాయట! మరి నిజంగానే సోనియాగాంధీ కుటుంబం ఇలాంటి వ్యవహారాలు చేసి ఉంటే అది దాష్టికమే అవుతుంది. అధికారం చేతిలో ఉందని చెప్పి ప్రైవేటు విమానయాన సంస్థ లను ఈ విధంగా వాడుకోవాలని చూడటం దారుణమే అవుతుంది మరి దీనిపై విచారణ చేస్తారా... మొత్తం వ్యవహారాన్ని బయటకు తీయడం జరుగుతందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: