తెరాస భుజాన ఎత్తుకున్న తెలంగాణా ఉద్యమం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందా? తన పంతానికి పోయి కే సి ఆర్ ఉద్యమాన్ని ఉద్యమాన్ని నీరు కార్చాడని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఏ సీమంద్రులను అడ్డుకుంటాం అన్నారో నేడు వాళ్ళే అనగే బాబు, జగన్ తల్లి విజయమ్మ హాయిగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. బాబు మహబూబ్ నగర్ యాత్ర , నిన్నటి వై కా పా భువనగిరి బహిరంగ సభ బాగానే జరిగాయి. ఇదే ప్రాంతంలో ఓ రెండేళ్ళ ముందు వారికి అడుగుపెట్టాలన్న చాలా కష్టంగా ఉండేది, నేడు వారు హాయిగా తిరగగలుగుతున్నారు, అందునా తెలంగాణా విషయం తేలకుండానే! అంటే కేవలం తన ఒంటేత్తు పోకడలతో కే సి ఆర్ చేసుకున్న స్వయం కృతం. ఇంకా ఫారం హౌస్ లోనే ఉంటూ తానో గొప్ప మేధావి, నిద్రిస్తున్న పులి అని అనుకుంటే తెరాస 2009 ముందు ఎలా ఉండేదో దాని కన్నా అద్వానంగా తయారవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి విలీనం మరింత సులువు! ఈ సారి వీరు ఢిల్లీ వెళ్ళకర్లేదు వారే ఇక్కడికి ఎవ్వరో ఒకరని పంపించి సంతకాలు తీసుకుంటారేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: