నిజంగా మన రాష్త్రం లో రాజకీయ పరిణామాలు గమనించే ఎవ్వరికి అయినా ఈ సందేహం రాక మానదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు , కాంగ్రెస్ , తెదేపా లను తప్పిస్తే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలో వలసలు భారీగా ఉంటున్నాయి. ముఖ్యంగా జగన్ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరంలేదు. జగన్ లేడు అన్న లోటును పూడ్చుకోవడానికి ఇలా బహిరంగంగా అందరిని చేర్చుకుంటూ, ఫోటో కు పోజులు ఇస్తూ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బిజీగా ఉన్నారు. కేసిఅర్ కూడా మొద్దు నిద్ర వీడి రంగంలోకి దిగారు. గెలిచే గుర్రాల పైనే బెట్టింగ్లు ఎక్కువ, అందునా అధికారం లబిస్తే దానితో వచ్చే పలుకుబడి, కాంట్రాక్ట్లు, డబ్బు అంతా ఇంతా కాదు. అందుకే ఎన్నకలకు ఇంకా టైము ఉండగా, ఇప్పటికే ఎవ్వరకి వారు ముందు జాగ్రత్తలో ఉన్నారు. కాని ఈ వలసల హడావుడి, ఆపరేషన్ ఆకర్ష నిజంగా ఎన్నికల నాటకీ ఉపయోగపడుతుందా అంటే, దానికి సమాధానం ఎవ్వరి వద్దా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: