తెలంగాణ పరిధిలోని పట్టభద్రుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాడు సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీ గా ఎన్నికవ్వాలని ఆయన ఉత్సాహం చూపుతున్నాడట. అయితే తనకు తెరాస మద్దతును ప్రకటిస్తే తాను నామినేషన్ వేయడానికి సిద్ధమని ఆయన చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

ముందుగా కమ్యూనిస్టు పార్టీలు సుద్దాలను బరిలోకి దింపడానికి ప్రయత్నించాయట. అందుకు సమ్మతిస్తూనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించాలని సుద్దాల కోరినట్టుగా తెలుస్తోంది. తెరాస గనుక మద్దతు ప్రకటిస్తే గెలవడం సులభమని అశోక్ తేజ లెక్క. అలాగాక టీఆర్ఎస్ వేరే అభ్యర్థిని బరిలోకి దించితే.. కమ్యూనిస్టు పార్టీల తరపు నుంచి తను బరిలోకి దిగితే.. అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నాడట.

అందుకే ఈ మేరకు తెరాస మద్దతు కోసం విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. తెరాస గనుక మద్దతును ప్రకటిస్తే సుద్దాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని సమాచారం. ఇదిలా ఉంటే మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన కే.నాగేశ్వర్ కూడా ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈయన కూడా కేసీఆర్ మద్దతునే కోరుతున్నాడట. టీఆర్ఎస్ మద్దతును ప్రకటిస్తే పోటీ చేయడానికి ఉత్సాహంతోఉన్నాడట. మరి వీరిలో కేసీఆర్ ఎవరికి మద్దతుగా నిలుస్తాడో..! ఎవరిని గెలిపించుకొంటాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: